News July 29, 2024

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా?

image

ఈవీలపై ఇచ్చే సబ్సిడీ గడువును కేంద్రం పొడిగించింది. జులై 31తో సబ్సిడీ ముగియనుండగా దాన్ని సెప్టెంబర్ 30 వరకు పెంచుతున్నట్లు గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారం టూవీలర్ కొనుగోలుపై రూ.10,000 వరకు, స్మాల్ త్రీవీలర్‌పై రూ.25వేల వరకు, లార్జ్ త్రీవీలర్‌పై రూ.50వేల వరకు సర్కార్ సబ్సిడీ ఇస్తుంది. దేశంలో ఈవీల వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News February 11, 2025

మద్యం నుంచి TDP పెద్దలకు కమీషన్లు: YCP

image

AP: రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడంపై YCP ఆరోపణలు చేసింది. ‘మద్యం వ్యాపారం ప్రభుత్వ పెద్దల వ్యక్తిగత ఆదాయ వనరుగా మారింది. ఈ మేరకు లైసెన్సీలకు మార్జిన్ పెంచుతున్నారు. దీంతో TDP పెద్దలకు కూడా కమీషన్ పెరుగుతోంది. అంతిమంగా మద్యం రేట్లు పెరుగుతున్నాయి. ఇది మందుబాబులకు పెనుభారంగా మారనుంది’ అని ట్వీట్ చేసింది. రూ.99 బ్రాండ్ క్వార్టర్, బీర్లు కాకుండా మిగతా మద్యం సీసాపై రూ.10 పెంచిన విషయం తెలిసిందే.

News February 11, 2025

అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్

image

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పాత చట్టాల దుమ్ము దులిపేస్తున్నారు. US వ్యాపారాలకు విఘాతం కలిగిస్తోందని ఫెడరల్ చట్టం ‘FCPA’ను నిలిపేశారు. మరిన్ని మినహాయింపులు, ఉపశమనం కల్పించేలా సవరించాలని కొత్త అటార్నీ జనరల్ పామ్ బొండిని ఆదేశించారు. అమెరికన్ కంపెనీలు, ఎగ్జిక్యూటివ్స్ బిజినెస్ కోసం ఇతర దేశాల అధికారులకు లంచం ఇవ్వడం ఈ చట్ట ప్రకారం నేరం. అదానీపై FCPA ప్రకారమే అభియోగాలు మోపడం గమనార్హం.

News February 11, 2025

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ (భారత ప్లేయర్లు)

image

*సచిన్- 34357 రన్స్ (782 ఇన్నింగ్సులు)
*విరాట్- 27329 (611)
*రాహుల్ ద్రవిడ్- 24208 (605)
*రోహిత్ శర్మ- 19519 (526)
*గంగూలీ- 18575 (488)
*ధోనీ- 17266 (526)
*సెహ్వాగ్- 17253 (443)
*అజహరుద్దీన్- 15593 (455)

error: Content is protected !!