News July 4, 2024
2030కి ఫుడ్ మార్కెట్ రూ.10లక్షల కోట్లకు..

భారత్లో ఆహార సేవల మార్కెట్ ₹5.5L cr ఉండగా, 2030కి ₹10L crకు చేరొచ్చని స్విగ్గీ-బెయిన్ సంయుక్త నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 32-34 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఆరేళ్లలో 43-45 కోట్లు చేరొచ్చని తెలిపింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వాటా 12 నుంచి 20 శాతానికి పెరగవచ్చని అంచనా వేసింది. ఇప్పుడు 70% వాటా 50 నగరాల నుంచే వస్తుండగా, రానున్న రోజుల్లో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ వృద్ధి నమోదుకావొచ్చని పేర్కొంది.
Similar News
News March 7, 2026
డిజిటల్ ఫ్రాడ్కు ₹25,000 పరిహారం!

₹50,000 లోపు సైబర్ మోసం జరిగితే కస్టమర్ పొరపాటు ఉన్నా ఒకేసారి గరిష్ఠంగా ₹25,000 వరకు పరిహారం అందించేలా RBI ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 5 రోజుల్లోపు కంప్లైంట్ చేస్తే ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. APR 6 వరకు ఈ ప్రతిపాదనలపై బ్యాంకులు అభిప్రాయం తెలియజేయొచ్చు. ఇవన్నీ ఓకే అయితే జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. సామాన్య కస్టమర్ల కష్టార్జితానికి రక్షణ కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.
News March 7, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 7, 2026
ఖమేనీ పాలనలో దిగజారిన ఇరాన్ ప్రతిష్ఠ

ఖమేనీ మరణంతో ఇరాన్లో నాయకత్వ సంక్షోభం ముదిరింది. 1981 నుంచి అధికారంలో ఉన్న ఆయన పాలనలో ఆ దేశం అంతర్జాతీయ సూచీల్లో అట్టడుగుకు పడిపోయింది. 2025 అవినీతి సూచీలో 153వ స్థానం, పత్రికా స్వేచ్ఛలో 176వ స్థానంతో దారుణమైన స్థితికి చేరింది. ప్రజాస్వామ్యం, పౌర హక్కుల విషయంలోనూ నిరంకుశ పాలనలోనే ఉందని రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. సుదీర్ఘ రాజకీయ స్థిరత్వం ఉన్నప్పటికీ సుపరిపాలన అందించడంలో ఖమేనీ విఫలమయ్యారు.


