News January 16, 2025
2047 నాటికి ఏపీ తలసరి ఆదాయం రూ.58.14 లక్షలు

AP: ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.68 లక్షలుగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి ఈ మొత్తం రూ.58.14 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు. తాము విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్కు దేశంలోనే తొలిసారి 16 లక్షల వ్యూస్ వచ్చాయన్నారు. వికసిత్ భారత్కు కూడా ఈస్థాయిలో స్పందన రాలేదని తెలిపారు. 2047కు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే తమ లక్ష్యమన్నారు.
Similar News
News February 11, 2025
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

TG: రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 30,11,329 మంది రైతులకు ₹1,834.09 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 27న 577 ఎంపిక చేసిన గ్రామాల్లో 4.41 లక్షల మందికి, ఫిబ్రవరి 5న ఎకరం లోపు సాగు చేస్తున్న 17.03లక్షల మందికి, ఇవాళ 2 ఎకరాలలోపు సాగు చేస్తున్న 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసినట్లు తెలిపింది. మరి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
News February 10, 2025
ALERT.. నోటిఫికేషన్ విడుదల

AP మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి జూనియర్ ఇంటర్, 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. FEB 15 నుంచి MAR 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 6, 7, 8, 9, తరగతుల్లో బ్యాక్ లాగ్ అడ్మిషన్లకు సైతం అప్లై చేయవచ్చు. జూనియర్ ఇంటర్కు ఏప్రిల్ 20, 5వ తరగతికి ఏప్రిల్ 27, బ్యాక్ లాగ్ క్లాసుల్లో చేరే వారికి ఏప్రిల్ 28న పరీక్ష ఉంటుంది.
News February 10, 2025
మస్తాన్ సాయి కస్టడీకి కోర్టు అనుమతి

TG: మహిళల వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న కేసులో అరెస్టైన మస్తాన్ సాయి పోలీస్ కస్టడీకి రాజేంద్రనగర్ కోర్టు అనుమతించింది. 5 రోజుల కస్టడీకి నార్సింగి పోలీసులు అనుమతి కోరగా, 2 రోజులకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ నెల 13న మస్తాన్ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.