News July 22, 2024
2050 నాటికి భారత్లో వృద్ధుల సంఖ్య డబుల్!

భారత్లో వృద్ధుల జనాభా 2050 నాటికి రెండింతలు అవుతుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) వెల్లడించింది. 60ఏళ్లుపైబడిన వృద్ధుల సంఖ్య 346 మిలియన్లకు చేరుతుందని వివరించింది. 2050 నాటికి దేశంలో 50% పట్టణాలే ఉంటాయని అంచనా వేసింది. వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనం, పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉందని UNFPA భారత అధ్యక్షురాలు ఆండ్రియా వోజ్నార్ పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.
News November 16, 2025
DIHARలో 21 పోస్టులు

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్(DIHAR) 21 JRF,రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి ఎంటెక్, బీటెక్, BE, MSc, M.VSc, PhD ఉత్తీర్ణతతో పాటు NET/GATE అర్హత గలవారు డిసెంబర్ 5న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వయసు 28 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. JRFకు నెలకు రూ.37వేలు+HRA, RAకు రూ.67వేలు+HRA చెల్లిస్తారు.
News November 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 68

ఈరోజు ప్రశ్న: మహాభారతం ప్రకారం.. మూడే మూడు బాణాలతో కురుక్షేత్రాన్ని ముగించగల సత్తా ఉన్న యోధుడు ఎవరు? ఆయన యుద్ధంలో పాల్గొనకపోవడానికి గల కారణాలేంటి?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


