News September 18, 2024

బీసీలకు 33శాతం రిజర్వేషన్‌కు క్యాబినెట్ ఆమోదం

image

AP: వెనుకబడిన వర్గాల వారికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదలను ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఉండటానికి రాజకీయపరంగా వారికి తగిన అవకాశాలు లేకపోవడమేనన్న విషయాన్ని గుర్తిస్తూ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News October 25, 2025

అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

image

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్‌తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆధార్‌తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.

News October 25, 2025

మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.

News October 25, 2025

US ఆఫీసర్ హత్య.. మోదీని టార్గెట్ చేసినందుకేనా?

image

US స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ బంగ్లాదేశ్‌లో హత్యకు గురవడం అనుమానాలకు దారితీసింది. PM మోదీని చంపేందుకు CIA కుట్ర చేసిందని, దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా, రష్యా టెర్రెన్స్‌ను హతమార్చిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్‌ కార్లో రహస్యంగా చర్చించారని పేర్కొన్నాయి. దేశ ప్రజలకు నిజమేంటో చెప్పాలని కాంగ్రెస్ నేత సింఘ్వీ తాజాగా డిమాండ్ చేశారు.