News September 11, 2024
క్యాబినెట్ విస్తరణ.. ఎవరికి పదవి వస్తుందో?

TGలో క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం <<14076811>>ఫిక్సయినట్లు <<>>తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 6 పదవులు ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద చర్చగా మారింది. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న CM రేవంత్ మంత్రి పదవులపై హైకమాండ్తో చర్చించనున్నారు. గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రాంమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, షబ్బీర్ అలీ, అజారుద్దీన్ సహా పలువురు రేసులో ఉన్నారు.
Similar News
News December 6, 2025
ఎల్లారెడ్డిపేట: విషాదం.. సౌదీలో ఆగిన గుండె

ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ గుట్టపల్లి చెరువు తండాకు చెందిన వ్యక్తి సౌదీలో గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గుగులోతు రవి అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విజిట్ వీసా మీద ఆరు నెలల క్రితం సౌదీ వెళ్లాడు. శనివారం ఉదయం 11 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు అక్కడివారు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహం త్వరగా స్వగ్రామం వచ్చేటట్లు చూడాలని KTRను బాధిత కుటుంబం వేడుకుంటోంది.
News December 6, 2025
మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.
News December 6, 2025
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


