News December 31, 2024
జనవరి 3న క్యాబినెట్ భేటీ
TG: జనవరి 3న సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. రైతు భరోసా విధివిధానాలు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేల చొప్పున చెల్లింపు సహా మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు. వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు తేదీతో పాటు రైతుభరోసా అమలు తేదీపైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ నెలలోనే క్యాబినెట్ భేటీ జరగాల్సి ఉండగా మన్మోహన్ మరణంతో వాయిదా పడింది.
Similar News
News January 19, 2025
పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్
ప్రముఖ యంగ్ సింగర్ దర్శన్ రావల్ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు ధరల్ సురేలియాతో కలిసి ఏడడుగులు వేశారు. వీరికి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2014లో ఇండియాస్ రా స్టార్ ఫస్ట్ సీజన్ ద్వారా ఇతను గుర్తింపు పొందారు. హిందీ, గుజరాతీ సినిమాల్లో వందకు పైగా పాటలు పాడారు. తెలుగులో నాని ‘జెర్సీ’ సినిమాలో ‘నీడ పడదని మంటననగలరా’ పాటను ఆలపించారు.
News January 19, 2025
సైఫ్ అలీఖాన్ హెల్త్ అప్డేట్
కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నారని ఆయన సోదరి సోహా అలీఖాన్ తెలిపారు. ‘అన్నయ్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. కోలుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సైఫ్ కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు’ అని ఆమె మీడియాతో అన్నారు. ఈనెల 16న అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయనను కత్తితో పొడిచాడు. మూడు రోజుల అనంతరం ఇవాళ నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
News January 19, 2025
లోకేశ్ను Dy.CM చేయడానికి అమిత్ షా ఒప్పుకోలేదు: అంబటి
AP: లోకేశ్ను Dy.CM చేస్తానన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రి అమిత్ షా ఒప్పుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘షా ఏమన్నారో మాకు తెలుసు. లోకేశ్ అన్నిశాఖల్లో వేలు పెడుతున్నారని, కంట్రోల్లో ఉంచమని బాబుకు సూచించారు. లోకేశ్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమయ్యాడని, స్పీడ్ తగ్గించుకోవాలని హెచ్చరించారు’ అని తెలిపారు. ఈ విషయాలు బయటికి రాకుండా కూటమి నేతలు వేరే కథలు వండి వారుస్తున్నారని ఎద్దేవా చేశారు.