News December 31, 2024

జనవరి 4న క్యాబినెట్ సమావేశం

image

TG: జనవరి 4 సాయంత్రం 4 గం.కు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12వేల సాయం, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీ, యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డుపై చర్చించే అవకాశం ఉంది.

Similar News

News January 19, 2025

రేషన్ కార్డు నిబంధనల్లో మార్పులు చేయాలి: హరీశ్ రావు

image

TG: ప్రజాపాలన దరఖాస్తులకూ రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన BRS విజయమని హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ప్రభుత్వం పేదల గురించి ఆలోచించదా? అని ప్రశ్నించారు. మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితి, భూ పరిమితి పెంచుతూ నిబంధనల్లో మార్పు చేయాలని కోరారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ను ఉపాధి హామీ స్కీమ్‌కు లింక్ చేయొద్దన్నారు.

News January 19, 2025

గజగజ.. 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

image

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో కనిష్ఠంగా 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జనవరి 24/25 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News January 19, 2025

kg చికెన్ ధర ఎంతో తెలుసా?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. HYDలో కేజీ స్కిన్ లెస్ ధర రూ.220-230గా ఉంది. అటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో రూ.240 వరకు ఉంది. లైవ్ బర్డ్ కేజీ రేటు రూ.117గా కొనసాగుతోంది. 12 కోడిగుడ్ల రిటైల్ ధర రూ.70గా ఉంది.