News February 7, 2025

ఈ నెల 20న మంత్రివర్గ సమావేశం

image

AP: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Similar News

News November 23, 2025

HYD: నొక్కడం కాదు.. కాల్ కొట్టండి

image

నల్లా బిల్లుకు సంబంధించి మీ మొబైల్ ఫోన్‌కువచ్చే లింకును ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రెస్ చేయవద్దని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. నీటి బిల్లుల పేరిట సైబర్ నేరగాళ్లు ఇటీవల APK ఫైల్స్ పంపుతున్నారని వాటితో అప్రమత్తంగా ఉండాలని వాటర్ బోర్డ్ అధికారులు పేర్కొంటున్నారు. జలమండలి ఎలాంటి లింకులు పంపదని.. అనుమానమొస్తే కస్టమర్ కేర్ 155313 నంబరుకు కాల్ చేయాలని పేర్కొన్నారు.

News November 23, 2025

ప్రతి ఇంటికి బైక్ ఉండాలన్నదే నా లక్ష్యం: విజయ్

image

వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి తథ్యమని TVK పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. కరూర్ తొక్కిసలాట తర్వాత ఆయన తొలిసారిగా కాంచీపురం సభలో మాట్లాడారు. ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. DMK తమకు రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విజయ్ ఆరోపించారు.

News November 23, 2025

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో దుమ్మురేపిన లక్ష్యసేన్

image

భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025లో అద్భుత విజయం సాధించారు. జపాన్‌ ఆటగాడు యూషీ తనాకాపై 21-15, 21-11 తేడాతో జయకేతనం ఎగరవేశారు. దీంతో సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన మూడో భారత ఆటగాడిగా లక్ష్య నిలిచారు. ఈ సీజన్‌లో అతనికి ఇదే తొలి BWF టైటిల్. అలాగే తన కెరీర్‌లో మూడో సూపర్‌ 500 టైటిల్‌.