News February 7, 2025

ఈ నెల 20న మంత్రివర్గ సమావేశం

image

AP: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Similar News

News February 8, 2025

TODAY HEADLINES

image

* రాష్ట్రంలో BCల జనాభా పెరిగింది: రేవంత్
* విజన్-2047కు సహకరించండి: నీతిఆయోగ్‌తో చంద్రబాబు
* ఒంగోలులో ముగిసిన RGV విచారణ
* విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌
* కుంభమేళాలో సన్యాసినిగా మారిన మరో నటి
* ఒక్క వ్యక్తికే రతన్ టాటా ఆస్తిలో ₹500కోట్లు!
* జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
* వడ్డీరేట్లు తగ్గించిన RBI
* తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు

News February 8, 2025

7 గంటల పాటు ప్రభావతిని ప్రశ్నించిన SP

image

AP: డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ ముగిసింది. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 7 గంటల పాటు ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభావతి A5గా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఆమె తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.

News February 8, 2025

130 కి.మీ వేగంవెళ్లేలా రైల్వేట్రాక్ అప్‌గ్రేడ్

image

విజయవాడ రైల్వేడివిజన్ పరిధిలోని ట్రాక్‌ను గంటకు130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఆధునీకీకరించనున్నారు. మెుత్తంగా 1,287 KM మేర ట్రాక్ అప్‌గ్రేడ్ చేయదలచగా ఇప్పటివరకూ 58శాతం మేర పనులు పూర్తయినట్లు డివిజన్ ఇంజినీర్ వరుణ్‌బాబు తెలిపారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలను ఆధునీకీకరించనున్నారు. నిడవదొలు -భీమవరం, నరసాపురం-గుడివాడ-మచిలీపట్నం, సామర్లకోట మార్గాల్లో ట్రాక్ అప్‌గ్రేడ్ పూర్తయిందని తెలిపారు.

error: Content is protected !!