News February 7, 2025

ఈ నెల 20న మంత్రివర్గ సమావేశం

image

AP: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Similar News

News March 6, 2026

ఎప్‌స్టీన్ ఫైల్స్.. ట్రంప్‌పై షాకింగ్ ఆరోపణలు

image

ఎప్‌స్టీన్ కేసులో అదృశ్యమైన 16 పేజీల డాక్యుమెంట్లను US DOJ తాజాగా బయటపెట్టింది. ఇందులో 1983లో ఒక మైనర్ బాలికపై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో తాను అడ్డుచెప్పగా ట్రంప్ తనను కొట్టి అక్కడి నుంచి పంపేశారని ఆ మహిళ FBI విచారణలో పేర్కొంది. ఈ రికార్డులను ఇన్నాళ్లూ ఎందుకు దాచారనే అంశం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కాగా ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు.

News March 6, 2026

ముంబై న్యూ జెర్సీలో హిట్‌మ్యాన్

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ IPL-2026కు ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ న్యూ జెర్సీలో ఫొటోలకు పోజులిచ్చారు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్.. ఐపీఎల్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంతో పోలిస్తే ఫుల్ ఫిట్‌నెస్ సాధించిన హిట్‌మ్యాన్.. ప్రత్యర్థులపై ఎలా చెలరేగుతారో చూడాలి. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందని క్రీడావర్గాలు వెల్లడించాయి.

News March 6, 2026

అభిషేక్ మాదిరే వరుణ్‌ను ఎందుకు సపోర్ట్ చేయరు: సెహ్వాగ్

image

నిన్న ENGతో మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 64 పరుగులు ఇవ్వడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటిపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్పందించారు. ‘ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా సరిగ్గా ఆడట్లేదు. అతడిని వెనకేసుకొస్తున్న వారికి బౌలర్‌కు సపోర్ట్ చేయడానికి ఎందుకు సమస్య? 3 మ్యాచ్‌లలో రన్స్ ఇవ్వగానే వేరే బౌలర్ కోసం చూస్తున్నామని చెబుతారు. ఆ కొత్త ప్లేయర్ రాణిస్తాడనే గ్యారంటీ ఏమిటి?’ అని ప్రశ్నించారు.