News January 4, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. రైతు భరోసా విధివిధానాలు ఖరారు?

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రైతు భరోసా నిబంధనలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ విధివిధానాలను నేడు ఖరారు చేసే అవకాశముంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, సమగ్ర కులగణనపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
Similar News
News November 19, 2025
సిర్పూర్(టి): ఈ నెల21 షూటింగ్ బాల్ పోటీలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి అస్మిత ఖేలో ఇండియా షూటింగ్ బాల్ బాలికల ఎంపిక పోటీలు ఈ నెల 21న సిర్పూర్ (టి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించనున్నారు. క్రీడాకారులు ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరై, ప్రిన్సిపల్ లావణ్యకు రిపోర్ట్ చేయాలని జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి గురువేందర్ తెలిపారు.
News November 19, 2025
అనకాపల్లి జిల్లాలో 2,42,480 రైతులకు లబ్ధి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కింద 2,42,480 మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. 19వ తేదీన రైతుల ఖాతాల్లో రూ.158.4 కోట్లు జమ కానున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,300, చోడవరంలో 51,260, మాడుగులలో 45,340, నర్సీపట్నంలో35,040, పాయకరావుపేటలో 39,300, ఎలమంచిలిలో 33,760 మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు.
News November 19, 2025
BOBలో 82 పోస్టులకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా(<


