News January 4, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. రైతు భరోసా విధివిధానాలు ఖరారు?

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రైతు భరోసా నిబంధనలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ విధివిధానాలను నేడు ఖరారు చేసే అవకాశముంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, సమగ్ర కులగణనపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Similar News

News November 15, 2025

MBNR: ధాన్యం కేటాయింపునకు బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి

image

2025-26 ధాన్యం కేటాయింపుకు బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 92 రైస్ మిల్లులు ఉండగా నామమాత్రంగా కేవలం 42 రైస్ మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారెంటీని సమర్పించాయని అన్నారు. గ్యారంటీ ఇవ్వని మిల్లులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయింపు జరగదన్నారు.

News November 15, 2025

శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఎయిర్‌పోర్టు

image

AP: ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య MOU కుదిరింది. CM CBN, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని CM తెలిపారు. పర్యాటకరంగం వృద్ధి చెందుతుందన్నారు.

News November 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 67 సమాధానాలు

image

ప్రశ్న: శ్రీమహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి?
జవాబు: విష్ణుమూర్తి శేషతల్పంపై శయనించి ఉండగా, భృగు మహర్షి ఆయన వక్షస్థలంపై కాలితో తన్నారు. అప్పుడు విష్ణువు ఏమాత్రం కోప్పడకుండా మహర్షి పాదాలకు క్షమాపణ చెప్పారు. తన నివాస స్థలమైన వక్షస్థలాన్ని ఒకరు కాలితో తన్నినా, విష్ణుమూర్తి అతడిని శిక్షించకపోవడంతో అలిగిన లక్ష్మీదేవి కోపంతో భూమ్మీదకు వచ్చింది.
<<-se>>#Ithihasaluquiz<<>>