News August 20, 2024

రేపు భారత్ బంద్‌కు పిలుపు

image

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. దీంతో రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాలి.

Similar News

News January 20, 2026

అడవులు ఖాళీ.. ఇక దోమల టార్గెట్ మనుషులే!

image

అడవులు తగ్గిపోతుండటంతో దోమలు ఇప్పుడు జంతువులకు బదులుగా మనుషుల రక్తం తాగడానికి ఇష్టపడుతున్నాయని బ్రెజిల్‌లో జరిగిన స్టడీలో తేలింది. అడవులు అంతరించిపోవడం వల్ల జంతువులు దూరమై దోమలకు వేరే ఆప్షన్ లేక మనుషులపై పడుతున్నాయట. 1,700 దోమలపై జరిపిన ఈ అధ్యయనంలో అవి మనుషుల రక్తానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిసింది. దీనివల్ల ఫ్యూచర్‌లో కొత్త రకమైన రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

News January 20, 2026

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

TG: మైనార్టీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలకు అప్లై చేసుకోవాలని మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఐదోతరగతి, ఇంటర్ ఫస్టియర్‌తో పాటు 6,7,8 బ్యాక్‌లాగ్ ఖాళీలకు FEB 28 వరకు <>దరఖాస్తు<<>> చేసుకోవచ్చని, గడువు పెంపు ఉండబోదన్నారు. ఇంటర్‌కు టెన్త్‌లో వచ్చిన మార్కులు, COEల్లో ప్రవేశానికి ఎంట్రన్స్, ఇంటర్వ్యూ ఉంటాయన్నారు. ఐదో తరగతి, బ్యాక్ లాగ్ ఖాళీలకు ఏప్రిల్ 24-30 వరకు విద్యార్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు.

News January 20, 2026

ఆయుష్షును పెంచే మహోద్దేశ సూత్రాలు

image

మంచి అలవాట్లు ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఇస్తాయి.
ఆభరణాలు ధరిస్తే ఆయుష్షు పెరుగుతుంది.
చక్కని దుస్తులు ధరిస్తే ముఖంలో తేజోమయం అవుతుంది.
ప్రసన్నంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
నవ్వుతూ ఉంటే సంపద కలుగుతుంది.
పట్టుదలతో కృషి చేస్తే విజయం సొంతమవుతుంది.
ఇతరులకు సహాయపడితే క్షేమం కలుగుతుంది.
తృప్తిగా ఉంటే యవ్వనంగా ఉంటారు.
మధురంగా మాట్లాడితే అదృష్టం వరిస్తుంది.
మితంగా భుజిస్తే చక్కని రూపం సొంతమవుతుంది.