News August 20, 2024

రేపు భారత్ బంద్‌కు పిలుపు

image

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. దీంతో రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాలి.

Similar News

News July 10, 2025

ఈనెల 25న మరోసారి క్యాబినెట్ భేటీ

image

TG: ఇవాళ్టితో కలిపి INC ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 19సార్లు క్యాబినెట్ సమావేశాలు నిర్వహించి 327అంశాలపై చర్చించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటివరకు ఆమోదించిన అంశాల అమలుపై ఇవాళ సమీక్షించినట్లు చెప్పారు. నెలకు 2సార్లు క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించిన మేరకు ఈనెల 25న మరోసారి సమావేశం అవుతామన్నారు. అమిటీ, సెంటినరీ రీహాబిటేషన్ విద్యాసంస్థలను వర్సిటీలుగా మార్చాలని నిర్ణయించామన్నారు.

News July 10, 2025

ఇంగ్లండ్ నాలుగు వికెట్లు డౌన్

image

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే పోప్‌ను జడేజా ఔట్ చేశారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్‌ను బుమ్రా బౌల్డ్ చేశారు. ప్రస్తుతం క్రీజులో రూట్(62*), కెప్టెన్ స్టోక్స్(0*) ఉన్నారు. ఇంగ్లండ్ స్కోర్ 172/4గా ఉంది.

News July 10, 2025

PHOTOS: ‘బాహుబలి’ టీమ్ రీయూనియన్

image

ఇండియన్ మూవీని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన ‘బాహుబలి’ మూవీ విడుదలై ఇవాళ పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా రీయూనియన్ అయ్యారు. డైరెక్టర్ రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, రమ్యకృష్ణ తదితరులు ఒక్కచోట చేరి తమ జర్నీని గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.