News February 16, 2025
కోళ్లు చనిపోతే ఈ నంబర్కు కాల్ చేయండి!

TG: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న వేళ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మం. నేలపట్లలో వెయ్యి బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు కోళ్ల నమూనాలు సేకరించి HYDలోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ల్యాబుకు పంపారు. 3 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్ రానుందని, అప్పటివరకు కోళ్లు అమ్మవద్దని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడైనా కోళ్లు చనిపోతే 9100797300కు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
Similar News
News March 11, 2026
ట్రంప్ కీలక నిర్ణయం.. రిలయన్స్తో భారీ డీల్

అమెరికాలోని టెక్సాస్లో భారీ ఆయిల్ రిఫైనింగ్ ప్రాజెక్టును అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత USలో ఏర్పాటవుతున్న తొలి రిఫైనరీ ఇదే. ఈ $300 బిలియన్ల ప్రాజెక్టులో రిలయన్స్ పార్ట్నర్గా చేరుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అందుకు కంపెనీకి థాంక్స్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే క్లీన్లీయెస్ట్ రిఫైనరీ అని, వేలాది ఉద్యోగాలు రావడమే కాకుండా అమెరికా ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుందని పేర్కొన్నారు.
News March 11, 2026
రాష్ట్ర ప్రజలకు CM ఉగాది కానుక

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు ఉగాది కానుక ప్రకటించారు. ఉగాది రోజున 2.50 లక్షల మంది లబ్ధిదారుల సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. వారికి ప్రభుత్వం తరఫు నుంచి అధికారిక లేఖ వెళ్లేలా చూడాలని ఆదేశించారు. కాగా 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.
News March 11, 2026
చిన్న సంస్థ.. పెద్ద దెబ్బ: అమెరికా యుద్ధ రహస్యాలు లీక్

చైనాకు చెందిన మిజార్విజన్ అనే చిన్న సంస్థ AI సాయంతో అమెరికా యుద్ధ వ్యూహాలను బట్టబయలు చేసింది. ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభానికి ముందే ఇజ్రాయెల్, సౌదీలోని అమెరికా వైమానిక స్థావరాలు, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల హై-రిజల్యూషన్ ఫొటోలను ఈ సంస్థ SMలో విడుదల చేసింది. జిలిన్-1 ఉపగ్రహాల ద్వారా సేకరించిన ఈ సమాచారం ఇరాన్ దాడులకు పరోక్షంగా సహకరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.


