News May 11, 2024

కోల్‌కతాను ముంబై నిలువరించేనా?

image

ఐపీఎల్‌లో ఇవాళ కోల్‌కతాతో ముంబై తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. KKR వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచింది. దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. మరోవైపు ముంబై ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఇప్పటివరకు ఆ జట్టు 12 మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

Similar News

News February 10, 2025

బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్

image

AP: ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ రోజున ఉ.10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. కాగా 15 రోజులపాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 28న రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

News February 10, 2025

రంగరాజన్‌పై దాడి దురదృష్టకరం: పవన్

image

చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిని AP Dy.CM పవన్ ఖండించారు. ఇది దురదృష్టకరమని, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని చెప్పారు. దాడి వెనుక కారణాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తనకు రంగరాజన్ అనేక సూచనలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను పరామర్శించాలని TG జనసేన నేతలకు పవన్ సూచించారు.

News February 10, 2025

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వినియోగం

image

TG: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 16 వేల మెగావాట్లకు చేరువలో డిమాండ్ ఉంది. ఈ నెల 7న అత్యధికంగా 15,920 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. యాసంగి పంటలు, వేసవి ప్రభావంతో డిమాండ్ పెరిగింది. మరోవైపు, విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!