News August 9, 2024

తల్లికి షుగర్ ఉంటే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?

image

చంటిబిడ్డకు తల్లిపాలే అమృతం. ఒకవేళ తల్లికి డయాబెటిస్ ఉంటే షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటేనే పాలివ్వాలంటున్నారు వైద్య నిపుణులు. తల్లికి షుగర్ ఎక్కువగా ఉంటే ఆ పాలు తాగిన బిడ్డలో చక్కెర స్థాయుల్ని నియంత్రించేందుకు ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుందని వివరిస్తున్నారు. అందువల్ల చక్కెర స్థాయి పడిపోయే హైపోగ్లైసీమియా బిడ్డలో తలెత్తే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Similar News

News December 26, 2025

అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రికి CBN వినతి

image

AP: వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ను CM CBN కోరారు. పంచసూత్రాల ప్రణాళిక అమలుతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10.70% అభివృద్ధి సాధించామన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, రూ.2,585 కోట్ల అంచనాతో డీపీఆర్‌ను వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి ఇప్పటికే సమర్పించినట్టు వినతిపత్రంలో పేర్కొన్నారు.

News December 26, 2025

రెడ్ కలర్ చూస్తే ఎద్దులు దాడి చేస్తాయా! నిజమేంటి?

image

రెడ్ కలర్ ఎద్దులకు నచ్చదని, దాడి చేస్తాయనేది అపోహ మాత్రమే. చాలా పశువుల్లాగే ఎద్దులకు కూడా రెడ్ కలర్‌ను గుర్తించే రెటీనా సెల్స్ ఉండవు. ఎద్దులు డైక్రోమాట్స్ (2కలర్ రిసెప్టర్లు) కావడంతో ఎల్లో, బ్లూ, గ్రీన్, వయొలెట్ రంగులను గుర్తించగలవు. వాటికి ఎరుపు రంగు గ్రేయిష్-బ్రౌన్ లేదా ఎల్లోయిష్-గ్రేలా కనిపిస్తుంది. వేగమైన కదలికల కారణంగా దాడికి దిగుతాయి. తెలుపు, నీలం రంగు క్లాత్స్ కదిలించినా దాడి చేస్తాయి.

News December 26, 2025

డిసెంబర్ 26: చరిత్రలో ఈరోజు

image

✒ 1899: స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జననం
✒ 1893: చైనాలో ప్రముఖ కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ జననం
✒ 1946: దర్శకుడు బి.నరసింగరావు జననం
✒ 1981: మహానటి సావిత్రి మరణం(ఫొటోలో)
✒ 1988: కాపు నేత వంగవీటి మోహనరంగా మరణం
✒ 2004: పలు దేశాల్లో విధ్వంసం సృష్టించిన సునామీ. దాదాపు 2,75,000 మంది మృతి