News November 3, 2024

భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చిన కెనడా.. ఖండించిన కేంద్రం

image

కెన‌డా మ‌రోసారి క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగింది. తాజాగా భార‌త్‌ను సైబ‌ర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. కెనడాలో సైబ‌ర్ నేరాల‌కు భార‌త్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, భారత ప్రభుత్వ ప్రాయోజిత సైబర్ నేరగాళ్లు గూఢచర్యం కోసం కెనడా ప్రభుత్వ నెట్‌వర్క్‌లపై దాడికి పాల్పడవచ్చని భావిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను భార‌త్ ఖండించింది. ఇది భారత్‌పై దాడికి కెన‌డా అనుసరిస్తున్న మ‌రో వ్యూహంగా అభివ‌ర్ణించింది.

Similar News

News July 6, 2025

ప్రపంచస్థాయి కెమికల్ హబ్స్ రావాలి: నీతిఆయోగ్

image

ప్రపంచస్థాయి కెమికల్స్ హబ్స్ స్థాపనపై కేంద్రం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ ఓ నివేదికలో పేర్కొంది. ‘అత్యధిక సామర్థ్యాలుండే 8 పోర్ట్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌నూ స్థాపించాలి. 2040నాటికి భారత్ లక్షకోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో గ్లోబల్ వ్యాల్యూ చెయిన్‌లో 3.5%గా ఉన్న వాటా 2040నాటికి 4-5శాతానికి పెరగనుంది. 2030నాటికి 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది’ అని నివేదికలో వివరించింది.

News July 6, 2025

మస్క్ కొత్త పార్టీతో ట్రంప్‌నకు నష్టమేనా?

image

ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ స్థాపించడం రిపబ్లిక్, డెమొక్రాటిక్ పార్టీలకు నష్టం చేకూర్చే అవకాశముంది. ముఖ్యంగా ట్రంప్‌నకు తలనొప్పి తీసుకురావొచ్చు. మస్క్ అపర కుబేరుడు, ఒక గొప్ప వ్యాపారవేత్త, ఒక్క ట్వీటుతో లక్షల మందిని ప్రభావితం చేయగల ఇన్‌ఫ్లుఎన్సర్. పైగా ‘మేక్ అమెరికా.. అమెరికా అగైన్’, ప్రజలకు స్వేచ్ఛనిప్పిస్తా అంటున్నారు. అయితే USలో 3 పార్టీల విధానం వర్కౌట్ అవ్వదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

News July 6, 2025

ప్రభాస్‌తో రణ్‌వీర్ బాక్సాఫీస్ క్లాష్?

image

ప్రభాస్‌తో బాక్సాఫీస్ క్లాష్‌కి బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ రెడీ అవుతున్నట్లు బీ టౌన్‌లో వార్తలొస్తున్నాయి. ఇవాళ రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా ‘దురంధర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజవుతోంది. ఈ మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ప్రభాస్‌తో పోటీకి దిగుతారా? అనేది వేచిచూడాలి.