News March 17, 2024
ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్పందన కార్యక్రమం రద్దు: కలెక్టర్

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ రంజిత్ భాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలియజేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి స్పందనలో అర్జీలు ఇవ్వడానికి రావద్దని ఆయన చెప్పారు.
Similar News
News January 27, 2026
రాజధాని రైతులకు 29న మలివిడత ప్లాట్ల కేటాయింపు

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ఈ నెల 29న ప్లాట్ల కేటాయింపు జరగనున్నట్లు మంత్రి నారాయణ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఇ- లాటరీ ద్వారా ప్లాట్లను నిబంధనల ప్రకారం లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ నెల 28కి బదులు 29వ తేదీన లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
News January 27, 2026
గుంటూరు: ఏపీఎస్ఆర్టీసీ ITI అప్రెంటిస్ ఎంపిక జాబితా విడుదల

APSRTC ITI అప్రెంటిస్షిప్కు దరఖాస్తు చేసి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన అభ్యర్థుల ఎంపిక జాబితాను apsrtc.ap.gov.in వెబ్సైట్లోని రిక్రూట్మెంట్ ట్యాబ్లో విడుదల చేశారు. గుంటూరు జిల్లాకు ఎంపికైన అభ్యర్థులు JAN 28న అవసరమైన ధ్రువపత్రాలతో జిల్లా ప్రజా రవాణాధికారి కార్యాలయం, గుంటూరులో హాజరుకావాలి. హాజరు కాని వారి స్థానంలో వెయిటింగ్ లిస్ట్ ఎంపిక జరుగుతుందని జిల్లా ప్రజా రవాణా అధికారి మాలతి తెలిపారు.
News January 26, 2026
GNT: ‘ఎట్ హోమ్’ విందు వెనుక ఘన చరిత్ర

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్లలో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయం అయినప్పటికీ, స్వాతంత్ర్యం తర్వాత మన రాష్ట్రపతి, గవర్నర్లు దీనిని అధికారికంగా కొనసాగిస్తున్నారు. ఈ వేడుకలో పాలకులు, ప్రముఖులు, అధికారులతో గవర్నర్ తేనీటి విందులో పాల్గొంటారు. తాజాగా విజయవాడలో జరిగిన కార్యక్రమానికి గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.


