News April 5, 2024

పాడేరు.. పట్టం కట్టేదెవరికి?

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు(ST) నియోజకవర్గం 1967లో ఏర్పడింది. 5సార్లు INC, 3సార్లు TDP, YCP 2సార్లు, BSP, జనతా పార్టీ చెరోసారి గెలిచాయి. ఈసారి సిట్టింగ్‌ MLA భాగ్యలక్ష్మిని కాదని విశ్వేశ్వరరాజును YCP బరిలో దింపింది. టీడీపీ నుంచి వెంకట రమేశ్ నాయుడు పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కలిసొస్తాయని విశ్వేశ్వరరాజు ధీమాగా ఉండగా, తనకు గెలుపు ఖాయమని రమేశ్ చెబుతున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News November 25, 2025

డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మూడు దశల్లో (డిసెంబర్ 11, 14, 17) పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉ.7 నుంచి మ.1 వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు 2PM నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.

News November 25, 2025

స్మృతి మంధానను లవర్ పలాశ్ మోసం చేశాడా?

image

క్రికెటర్ స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ <<18374733>>వివాహం<<>> ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆమె తండ్రికి గుండెపోటు రావడంతో వివాహాన్ని ఆపేసినట్లు ప్రకటించారు. ఇప్పుడు మ్యారేజ్ క్యాన్సిలవ్వడానికి కారణం మరొకటుందని SMలో చర్చ జరుగుతోంది. పలాశ్ వేరే యువతితో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి. అందుకే స్మృతి పెళ్లి రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ఈ స్క్రీన్ షాట్స్‌ను అఫీషియల్‌గా ధ్రువీకరించాల్సి ఉంది.

News November 25, 2025

ఇతిహాసాలు క్విజ్ – 77 సమాధానాలు

image

ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా ఇవ్వమని ఎందుకు అడిగాడు?
జవాబు: ఏకలవ్యుడు మొరుగుతున్న కుక్క నోటిని బాణాలతో కుట్టి, దాన్ని మొరగకుండా చేశాడు. ఈ విలువిద్యను చూసిన ద్రోణుడు అతనికి అస్త్రాలను దుర్వినియోగం చేస్తాడని, విచక్షణా రహితంగా వాడే అవకాశముందని విలువిద్యకు కీలకమైన బొటనవేలుని గురుదక్షిణగా అడిగాడు. అలాగే అర్జునుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>