News April 25, 2024
కరోనాలోనూ బటన్లు నొక్కడం ఆపలేదు: జగన్

AP: కరోనా కాలంలోనూ బటన్లు నొక్కడం ఆపలేదని సీఎం జగన్ తెలిపారు. ‘సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర మాది. రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు పంచాం. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. మేనిఫెస్టోలో పేర్కొన్న 99 శాతం హామీలు నెరవేర్చాం. చంద్రబాబుకు రోజూ నన్ను తిట్టడమే పని. చంద్రబాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా? అని ప్రజలను తేల్చుకోమన్నారు.
Similar News
News December 17, 2025
చేతిలో డబ్బు నిలవాలంటే..

ధనం వస్తూ ఖర్చు అవుతూ ఉంటే, ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క దగ్గర రోజూ సాయంత్రం దీపం వెలిగించాలి. ప్రతి సోమవారం శ్రీసూక్తం పఠిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలాగే, శ్రీయంత్రం, కనకధారా యంత్రం, కుబేర యంత్రం ఈ మూడింటిని పూజా మందిరంలో ఉంచి, రోజూ పూజిస్తే లక్ష్మీకటాక్షం లభించడం తథ్యం. ఇలా చేయడం ద్వారా డబ్బు నిలవక పోవడం అనే సమస్య తగ్గుతుంది.
News December 17, 2025
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News December 17, 2025
ముగిసిన పోలింగ్.. కాసేపట్లో ఫలితాలు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. చివరి విడత పోలింగ్ పూర్తయింది. 3,752 సర్పంచ్ స్థానాల్లో 12,652 మంది, 28,410 వార్డు స్థానాల్లో 75,725 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. మ.2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అధికారులు ఆ వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో రాష్ట్రంలో దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియకు తెర పడనుంది.


