News April 25, 2024
కరోనాలోనూ బటన్లు నొక్కడం ఆపలేదు: జగన్
AP: కరోనా కాలంలోనూ బటన్లు నొక్కడం ఆపలేదని సీఎం జగన్ తెలిపారు. ‘సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర మాది. రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు పంచాం. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. మేనిఫెస్టోలో పేర్కొన్న 99 శాతం హామీలు నెరవేర్చాం. చంద్రబాబుకు రోజూ నన్ను తిట్టడమే పని. చంద్రబాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా? అని ప్రజలను తేల్చుకోమన్నారు.
Similar News
News January 22, 2025
డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం: TGSRTC
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని TGSRTC ఖండించింది. ఎలక్ట్రిక్ బస్సుల మెయిన్టనెన్స్, ఛార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా TGSRTC ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొస్తున్నామని, ఈ ఏడాది మేలో మరిన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.
News January 22, 2025
INDvsENG టీ20ల్లో మోస్ట్ రన్స్, వికెట్స్ వీరివే
☛ మోస్ట్ రన్స్: విరాట్ కోహ్లీ – 648 (38.11 avg), జోస్ బట్లర్ – 498 (33.20), రోహిత్ శర్మ – 467 (35.92), జాసన్ రాయ్ – 356 (23.73), ఇయాన్ మోర్గాన్ – 347 (26.69)
☛ మోస్ట్ వికెట్స్: జోర్డాన్ (24), చాహల్ (16), హార్దిక్ (14), బుమ్రా (9), భువనేశ్వర్ (9).
News January 22, 2025
‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ విడుదల ఫిక్స్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా 5 వారాలు పూర్తయ్యాక ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 14వ తేదీన స్ట్రీమింగ్కు వస్తుందని అంచనా వేశాయి. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.