News March 6, 2025

భూములు అమ్మితేగానీ ప్రభుత్వం నడపలేరా?: KTR

image

TG: భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి సీఎం రేవంత్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని KTR విమర్శించారు. గచ్చిబౌలి పరిధిలో 400 <<15655774>>ఎకరాలను <<>>అమ్మి రూ.30వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలపై మండిపడ్డారు. ఈ భూములు అమ్మడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ మాట మార్చారని దుయ్యబట్టారు. హైడ్రా, మూసీ పరిధిలో కూల్చివేతలతో రాష్ట్ర ఆదాయం తగ్గిందని ఆరోపించారు.

Similar News

News April 11, 2026

వాట్సాప్‌లోనే రిజిస్ట్రేషన్ సర్వీసులు

image

TG: స్థిరాస్తులు, భూములకు సంబంధించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. 8096958096 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. కావాల్సిన సర్వీసు ఎంచుకొని వివరాలు నమోదు చేసి, ఫాం నింపాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ చేసి సర్వీసులు పొందవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆమోదం తర్వాత సర్టిఫైడ్ EC కాపీ నేరుగా వాట్సాప్‌లోనే అందుతుంది.
Share It

News April 11, 2026

చంద్రుడిపై ప్లాట్లు.. ₹100 కోట్లు సంపాదించిన రియల్టర్

image

ఆర్టెమిస్-2 వ్యోమగాములు భూమికి తిరిగొచ్చిన వేళ చంద్రుడిపై ప్లాట్లు అమ్మే డెన్నిస్ హోప్ వార్త వైరలవుతోంది. 1980లో అంతర్జాతీయ చట్టాల్లోని లొసుగులను వాడుకుని చంద్రుడిని తన ఆస్తిగా ప్రకటించుకున్నారాయన. ఇప్పటి వరకు 70 లక్షల మందికి పైగా భూములు అమ్మి ₹100 కోట్లకు పైగా సంపాదించారు. సెలబ్రిటీలు సైతం ఇక్కడ ఎకరాల కొద్దీ కొనేసినట్లు టాక్. చట్టబద్ధత లేకపోయినా ఈ ‘మూన్ రియల్ ఎస్టేట్’ హాట్ టాపిక్‌గా మారింది.

News April 11, 2026

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే..

image

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే శరీరానికి చలువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఇది శరీర వేడిని తగ్గించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పరగడుపున తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది’ అని అంటున్నారు. ‘రోజుకు 50-120ml మాత్రమే తీసుకోవాలి. జెల్‌ను నీటితో కడిగి మిక్సీలో వేసి నీరు, నిమ్మరసం/తేనె కలుపుకోవాలి’ అని సూచిస్తున్నారు.