News February 18, 2025
47 మంది TDP వర్గీయులపై కేసు కొట్టివేత

AP: పల్నాడు జిల్లా మాచవరంలో 47 మంది టీడీపీ వర్గీయులపై నమోదైన హత్యాయత్నం కేసును ఇవాళ గురజాల సబ్ కోర్టు కొట్టేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జులైలో తురకపాలెంకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు, అతని భార్యతో సహా 47 మందిని హత్యాయత్నం కేసులో నిందితులుగా చేర్చారు. నేడు ఆ కేసు విచారణకు రాగా కోర్టు కొట్టేసింది. దీనిపై గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 23, 2025
SLBC సహాయక చర్యలపై వివరాలు బయటపెట్టాలి: హరీశ్ రావు

TG: SLBC సొరంగం వద్ద ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై పూర్తి వివరాలు బయట పెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘ఘటన జరిగి నెల రోజులైనా సొరంగంలో చిక్కుకున్నవారు ఏమయ్యారో ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఒకరి మృతదేహం వెలికి తీయడం తప్ప, మిగతా ఏడుగురి జాడ కనుగొనడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయం. భూ భౌతిక శాస్త్రవేత్తలు హెచ్చరించినా రాజకీయ ప్రయోజనాల కోసం టన్నెల్ పనులు ప్రారంభించారు’ అని ట్వీట్ చేశారు.
News March 23, 2025
RCB బౌలింగ్ బాగుందనడం సంతోషం: మాల్యా

IPL2025 తొలి మ్యాచులో KKRపై విజయం సాధించిన RCBకి ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా X వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఎట్టకేలకు ఆర్సీబీ బాగా బౌలింగ్ చేసిందని కామెంటేటర్స్ చెప్పడం సంతోషంగా ఉంది. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తే అర్థం అవుతోంది’ అని పేర్కొన్నారు. కాగా బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన మాల్యా ప్రస్తుతం UKలో నివసిస్తున్న సంగతి తెలిసిందే.
News March 23, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.