News May 12, 2024
యూపీలో 93మంది ఎన్నికల సిబ్బందిపై కేసు

యూపీలోని లక్నోలో ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 93మంది సిబ్బందిపై కేసు నమోదుకానుంది. ఎన్నికల సంఘం నిబంధనల్ని అనుసరించి వీరందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల కోసం స్థానిక జననారాయణ్ పీజీ కళాశాలలో సెషన్ శిక్షణ నిర్వహించగా 93మంది రాలేదని స్పష్టం చేశారు. యూపీలో 80 సీట్లకు 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News February 16, 2025
రూ.62కోట్ల నష్టం తెచ్చిపెట్టిన ఎక్స్ప్రెస్

సాధారణంగా రైళ్లలో చాలా రద్దీ ఉంటుంది. సీటు దొరకడమే కష్టం. అయితే ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో నడిచే తేజస్ ఎక్స్ప్రెస్ ప్రయాణికుల కొరతతో ఇబ్బంది పడుతోంది. గత మూడేళ్లుగా ఈ ట్రైన్ వల్ల రైల్వేశాఖకు రూ.62.88 కోట్ల నష్టం వచ్చింది. దీంతో దీని నిర్వహణ బాధ్యతను రైల్వే IRCTCకి అప్పగించింది. అయినప్పటికీ తగినంతగా ప్యాసింజర్లు లేక నష్టాల మార్గంలో ప్రయాణిస్తోంది.
News February 16, 2025
వల్లభనేని వంశీ అంటేనే అరాచకం : మంత్రి నిమ్మల

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం అవినీతికి మారుపేరని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వంశీని సమర్థిస్తున్న జగన్ కూడా ఒక అరాచక శక్తి అని మండిపడ్డారు. ‘దేశంలో ఎక్కడా ఏ పార్టీ ఆఫీస్లపై దాడి జరగలేదు. కానీ టీడీపీ ఆఫీస్పై వంశీ దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు చేసిన దళితుడిని కిడ్నాప్ చేసిన ఘనుడు. 11 సీట్లు ఇచ్చినా వైసీపీ నేతలు, జగన్కు ఇంకా బుద్ధి రాలేదు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 16, 2025
న్యాయమూర్తులను ఏరేస్తున్న ట్రంప్

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా 20మంది ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను తొలగించారు. దీంతో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పలువురు కోర్టులలో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘తన దేశాన్ని కాపాడుకొనే వ్యక్తి ఎన్నటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు’ అనే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్ను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.