News March 18, 2025
సెలబ్రిటీలపై కేసు.. పోలీసుల కీలక ఆదేశాలు

TG: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్ ఉన్నారు.
Similar News
News October 19, 2025
శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు చెప్పారు. కాగా శ్రీవారిని నిన్న 82,136 మంది దర్శించుకున్నారు. వారిలో 29,023 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా స్వామివారికి రూ.3.49 కోట్ల ఆదాయం వచ్చింది.
News October 19, 2025
టాస్ ఓడిన భారత్

తొలి వన్డే: భారత్తో పెర్త్లో జరగనున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు.
జట్లు:
IND: రోహిత్, గిల్(C), కోహ్లీ, శ్రేయస్, రాహుల్, అక్షర్ పటేల్, సుందర్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్దీప్ సింగ్
AUS: హెడ్, మార్ష్(C), షార్ట్, ఫిలిప్, రెన్షా, కొన్నోలీ, ఓవెన్, స్టార్క్, ఎల్లిస్, కున్హెమన్, హేజిల్వుడ్
News October 19, 2025
దీపావళి దీపాలు: ఈ తప్పులు చేయకండి

దీపావళి పర్వదినాన దీపాలు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. తడి ప్రమిదల్లో దీపాలు వెలిగించరాదని అంటున్నారు. ‘బొట్టు లేకుండా దీపారాధన చేయకూడదు. దీపం వెలిగించే సమయంలో మౌనం పాటించాలి. జ్యోతిని ఏక హారతితో వెలిగించడం ఉత్తమం. ఒకే వత్తిని ఉపయోగించకూడదు. రెండు లేదా మూడు వత్తులతో దీపాలు పెట్టడం శుభకరం. ఈ నియమాలు పాటించి, పవిత్ర దీపకాంతిని స్వాగతించాలి’ అని సూచిస్తున్నారు.