News March 28, 2024

BJP నేత దిలీప్ ఘోష్‌పై కేసు నమోదు

image

ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన BJP నేత దిలీప్ ఘోష్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనకు ఈసీ నోటీసులు ఇచ్చింది. మమతా బెనర్జీపై ‘ఎవరి కూతురో?’, ‘బెంగాల్‌కు సొంత కూతురే కావాలి’ వంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ టీఎంసీ నేతల ఫిర్యాదుతో ఘోష్‌పై కోల్‌కతాలోని దుర్గాపూర్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదైంది.

Similar News

News January 8, 2026

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

image

TG: హైదరాబాద్ శివారు మోకిల పరిధిలోని మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థిని నక్షత్ర గాయపడ్డారు. మృతులను సూర్యతేజ(20), సుమిత్(20), శ్రీనిఖిల్(20), రోహిత్‌(18)గా గుర్తించారు. వీరంతా ICFA ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నట్లు తెలుస్తోంది. కారులో మోకిల నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.

News January 8, 2026

మిరప పంటలో బూడిద తెగులు – నివారణ

image

మిరప పంటలో బూడిద తెగులు ఎక్కువగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. పొడి లాంటి తెల్లటి మచ్చలు ఆకుల కింది భాగంలో కనబడతాయి. ఆకు పైభాగంలో పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా రంగుమారిన ఆకులు రాలిపోవడం జరుగుతుంది. ఈ తెగులు నివారణకు Mycobutanil అనే మందు 1.5 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా azoxystrbin Tebucinazole 1.5ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

News January 8, 2026

ఇంట్లో దేవుడి చిత్రపటాలు ఏ దిశలో ఉంటే ఉత్తమం?

image

పూజ గదిలో చిత్రపటాలను ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశ ముఖంగా ఉండేలా చూసుకోవాలి. అంటే మనం పూజ చేసేటప్పుడు తూర్పు వైపునకు తిరిగి ఉండాలి. లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి పటాలను కలిపి ఉంచడం శుభకరం. పగిలిన లేదా చినిగిపోయిన పటాలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు. పటాలకు ప్రతిరోజు గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు.