News March 28, 2024
బీజేపీ ఎంపీ బండి సంజయ్పై కేసు నమోదు

TG: బీజేపీ ఎంపీ బండి సంజయ్ సహా తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోడుప్పల్ సమీపంలోని చెంగిచర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకుగాను ఈ కేసు నమోదైంది. కాగా హోలీ పండగ నాడు హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించేందుకు బండి సంజయ్ నిన్న అక్కడకి చేరుకున్నారు. బండి సంజయ్ను పోలీసులు అనుమతించకపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
Similar News
News November 18, 2025
చెరకు సాగుకు భూమి తయారీ – సూచనలు

చెరకును నాటడానికి 4 వారాల ముందే పశువుల గెత్తం లేదా కంపోస్ట్ ఎరువును ఎకరానికి 10 టన్నుల చొప్పున వేసి భూమిలో కలియదున్నాలి. బరువు నేలల్లో 5-6 టన్నులు వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద వంటి వాటిని పెంచి నేలలో కలియదున్నాలి. పచ్చిరొట్ట పంటలు భూమికి చేర్చడం వల్ల పంటకు భాస్వరం లభ్యత పెరగడమే కాకుండా, భూమికి నీటిని నిలుపుకునే శక్తి పెరిగి పంట బాగా ఎదగడానికి దోహదపడుతుంది.
News November 18, 2025
చెరకు సాగుకు భూమి తయారీ – సూచనలు

చెరకును నాటడానికి 4 వారాల ముందే పశువుల గెత్తం లేదా కంపోస్ట్ ఎరువును ఎకరానికి 10 టన్నుల చొప్పున వేసి భూమిలో కలియదున్నాలి. బరువు నేలల్లో 5-6 టన్నులు వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద వంటి వాటిని పెంచి నేలలో కలియదున్నాలి. పచ్చిరొట్ట పంటలు భూమికి చేర్చడం వల్ల పంటకు భాస్వరం లభ్యత పెరగడమే కాకుండా, భూమికి నీటిని నిలుపుకునే శక్తి పెరిగి పంట బాగా ఎదగడానికి దోహదపడుతుంది.
News November 18, 2025
ఉద్యోగుల పనితీరుపై కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కన్ను

IT సంస్థలు హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులతో పనిచేయిస్తున్నాయి. అయితే వారి పనితీరు తెలుసుకొనేలా ‘Cognizant’ ‘ప్రో-హాన్స్ స్టైల్’ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టింది. ఇది మౌస్ను ట్రాక్ చేస్తుంటుంది. 300 సెకండ్లు కదలకపోతే ఐడల్గా, 15 ని.లు మించితే దూరంగా ఉన్నట్లు తెలుపుతుంది. వాడే అప్లికేషన్లనూ గుర్తిస్తుంది. కాగా ఇది సిబ్బంది పనితీరును అంచనా వేయడానికి కాదని, వినియోగం తెలుసుకొనేందుకేనని కంపెనీ చెబుతోంది.


