India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2024-25 విద్యా సంవత్సరానికి విద్యా వారధి హెచ్డీ(Ph.D)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 01.
దీపావళి పండుగ సందర్భంలో టపాసులు విక్రయించేవారు నిబంధనలను తప్పక పాటించాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. టపాసులు పేల్చే సమయంలో తల్లితండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీపావళి పండుగ జరుపుకునే సమయంలో ఎంత కాంతి, ఆనందాన్ని ఇస్తుందో అవి వికటిస్తే కుటుంబాల్లో అంతే విషాదం తెచ్చిపెడతాయన్నారు. అందుకోసమే టపాసులు విక్రయించే వారితో పాటు పేల్చేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులను సూచించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వివిధ డైరీల సంఘాలు, సంస్థ ప్రతినిధులతో చర్చించారు.
గోనెగండ్ల మండల పరిధిలోని ఎస్.లింగందిన్నె వద్ద కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా కొనకండ్లకు చెందిన కుమ్మరి హేమాద్రి, భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి మంగళవారం కర్నూలుకు వెళ్తుండగా ఎస్.లింగందిన్నె సమీపంలో లారీ రివర్స్లో వచ్చి కారును ఢీకొంది. హేమాద్రికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక హేమాద్రి(38) మృతి చెందాడు.
ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల అయింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 16,185 మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థులు ఫైనల్ కీ కోసం https://cse.ap.gov.in/ వెబ్సైట్లో సందర్శించాలి. నవంబర్ 2వ తేదీన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయనుంది.
ఖరీఫ్ సీజన్లో కరవు మండలాలు..
➤నార్పల➤అనంతపురం
➤ తాడిమర్రి ➤ముదిగుబ్బ ➤తలుపుల➤
☞ విడపనకల్లు ☞ యాడికి ☞ గార్లదిన్నె
☞ బీకేసముద్రం ☞ రాప్తాడు
☞ కనగానిపల్లె
☞ ధర్మవరం ☞ నంబులపూలకుంట
☞ గాండ్లపెంట ☞ బుక్కపట్నం ☞ రామగిరి
☞ పరిగి
➤ (తీవ్రమైన కరవు) ☞ (మధ్యస్త కరవు) అని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రత్తిపాడు మండలం చిన్న కొండ్రుపాడులో మంగళవారం వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి-కొడుకుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కుమారుడు చేతిలో తోక వెంకటరామయ్య(60) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిద్ధవటం పెన్నా నదిలో ఎగువ పేట దళిత వాడకు చెందిన సునీత (19) గల్లంతైనట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. మంగళవారం నదిలోకి దిగిన యువతి ప్రవాహ వేగంలో కొట్టుకుపోయిందన్నారు. దీంతో పోలీసులు పెన్నా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. తమ బిడ్డను ఎలాగైనా కాపాడాలని యువతి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
➤తంబళ్లపల్లె ➤గుర్రంకొండ ➤బి.కొత్తకోట
➤కలకడ ➤పీలేరు ➤కలికిరి
➤వాయల్పాడు ➤కురబలకోట ➤పీటీఎం
➤మదనపల్లె ➤నిమ్మనపల్లె ➤పెనుమూరు
➤యాదమరి ➤గుడిపాల
☞శ్రీరంగరాజపురం ☞చిత్తూరు ☞సోమల
☞శాంతిపురం ☞రొంపిచెర్ల ☞పూతలపట్టు
☞పుంగనూరు ☞పలమనేరు
☞బైరెడ్డిపల్లె ☞వి.కోట ☞గుడుపల్లె
☞కుప్పం ☞రామకుప్పం
➤(తీవ్రమైన కరవు) ☞(మధ్యస్త కరవు) అని ప్రభుత్వం ప్రకటించింది.
పొన్నలూరు మండలంలోని నాగిరెడ్డిపాలెం జంక్షన్ వద్ద ఎస్ఐ అనూక్ మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. కనిగిరి నుంచి వస్తున్న ఓ కారుని ఆపి తనిఖీ చేశారు. కారులోని మహిళ వద్ద ఏడాది బాబు ఉండటంతో పాటు ఆమె మాటలకు అనుమానం వచ్చి విచారించినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ఆ బాలుడుని కావలిలో కిడ్నాప్ చేసినట్లు మహిళ అంగీకరించిందని ఆయన వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.