India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలోని హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలిపారని జిల్లా SP అశోక్ కుమార్ పేర్కొన్నారు. కడప ఉమేష్ చంద్ర కల్యాణ మండపంలో ముస్లిం సోదరులకు, పోలీస్ శాఖలోని ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కడపలో ప్రతి ఒక్కరు సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.
రంజాన్ పండుగ సందర్భముగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో విశాఖ సీపీ ఆఫీసులో ప్రతి సోమవారం జరిగే “ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదివారం తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితిలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లలో, కంట్రోల్ రూమ్ నంబర్ను సంప్రదించాలన్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..తోటి వారికి, పేద వారికి మనకు ఉన్న దాంట్లో సహాయం చేసే గొప్ప దాన గుణాన్ని చాటే పండుగ రంజాన్ అన్నారు. దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాస ఉపవాస దీక్షలు నియంత్రణా సాధ్యం చేసే గొప్ప సందేశం అని పేర్కొన్నారు.
నిత్యం విధి నిర్వహణలో బిజీబిజీగా గడిపే పోలీసులు ఒక్కసారిగా పంచకట్టులో ఆకట్టుకున్నారు. తెలుగు నూతన సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజు అదివారం కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఉగాది వేడుకలు అంబరాన్ని అంటాయి. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు ఇతర అధికారులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలకు ఎస్పీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు కావడంతో సోమవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార (PGRS) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కావున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
➤ఒకే కుటుంబంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు ➤ శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి➤ ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఐల బదిలీ ➤ బ్రెయిలీ భగవద్గీత రూపకర్తకు ఉగాది పురస్కారం➤ కర్నూలులో ఉగాది ఉత్సవాల్లో మంత్రి, జిల్లా కలెక్టర్ ➤ నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పండి: జిల్లా ఎస్పీ➤ RU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల➤ రాఘవేంద్ర స్వామి మఠంలో పంచాంగ శ్రవణం
పవిత్ర రంజాన్ సందర్భంగా అల్లాహ్ తన కరుణతో అందరినీ దీవించాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. అందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రశాంతత లభించాలని కోరారు. రంజాన్ మాసం జీవితాల్లో వెలుగు నింపాలనీ, ప్రేమ, శాంతి, సామరస్యాన్ని అందించాలనీ కోరారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో మన హృదయాలను శుద్ధి చేసుకోవాలని, విజయానికి మార్గం సుగమం కావాలని ఆయన అభిలషించారు.
వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్ను చూసేందుకు 65 మంది అనాథ చిన్నారులకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీ అవకాశం కల్పించారు. వీరిలో భీమిలి ఎస్.ఓ.ఎస్ ఆర్గనైజేషన్ నుంచి 45 మంది, గాజువాకకు చెందిన డిజైర్ ఆర్గనైజేషన్ నుంచి 20 మందికి అవకాశం కల్పించారు. క్రికెట్ నేరుగా చూడడం తమకు చాలా సంతోషంగా ఉందని పిల్లలు హర్షం వ్యక్తం చేశారు. సీపీతో కలిసి వారు ఫొటోలు దిగారు.
విశాఖపట్నంలో ఆదివారం జరిగిన ఢిల్లీ- సన్ రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్ను దేశ, రాష్ట్ర ప్రముఖులు వీక్షించారు. వీక్షించిన వారిలో ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
పండగలు భారతదేశ సంస్కృతిలో భాగమని సీఎం చంద్రబాబు అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమాజ బాగు కోసం తపనపడే వ్యక్తి అని కితాబు ఇచ్చారు. ట్రస్ట్ నడపడం అంటే సాధారణ విషయం కాదని, స్వర్ణ భారత్ ట్రస్ట్ యువతలో స్ఫూర్తిని నింపుతోందన్నారు.
Sorry, no posts matched your criteria.