Andhra Pradesh

News April 13, 2026

200 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులో జైలు: ఎస్పీ

image

మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారికి ఫైన్లతో పాటు జైలు శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. రామభద్రపురం పోలీసు స్టేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. జిల్లాలో ఇప్పటివరకు 200 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్షలు వేసినట్లు తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాహన చట్టాలను పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News April 13, 2026

నేడు కలెక్టరేట్ కార్యాలయంలో పీజీఆర్ఎస్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆదివారం కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News April 13, 2026

డీసీపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ డ్రైవింగ్!

image

మర్రిపాడు మండలం, డీసీపల్లి – ఎన్నావాడ మార్గ మధ్యలో బైక్.. ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న మహేశ్, వెంకటేశ్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు.

News April 12, 2026

ప్రకాశం: కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డ తండ్రి

image

ప్రకాశం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తాళ్లూరు(M)లో తండ్రి తన 13 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే 2, 3 రోజుల నుంచి బాలికకు కడుపు నొప్పి వస్తుండటంతో ఒంగోలు రిమ్స్‌ కు తరలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లూరు PS హెడ్ కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 12, 2026

విశాఖ: రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 12, 2026

నెల్లూరు: సుధాకర్ చనిపోయినా..!

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.

News April 12, 2026

తిరుపతి గంగమ్మ జాతర ఎప్పుడంటే?

image

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 5న చాటింపుతో ప్రారంభం కానుంది. 6వ తేదీ భైరాగి వేషం, 7న బండ వేషం, 8న తోటి వేషం, 9న దొర వేషం, 10న మాతంగి వేషాలు ఉంటాయి. 11న సున్నపు కుండలు, 12న జాతర, 13న అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. జాతర పోస్టర్లను ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆదివారం ఆవిష్కరించారు.

News April 12, 2026

GNT: కటకటాల్లోకి సహాయ కమిషనర్.. ఉద్యోగం నుంచి సస్పెండ్

image

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ACB అధికారులు సహాయ కమిషనర్ శాంతిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 7న నిర్వహించిన తనిఖీల్లో రూ. 1.37 కోట్ల అక్రమాస్తులను గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. కోర్టు 21వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను విజయవాడ జైలుకు తరలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 48 గంటలకు పైగా కస్టడీలో ఉన్నందున, ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 12, 2026

VZM: కలెక్టరేట్‌లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలకు విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. భూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ కూడా నిర్వహిస్తామన్నారు. కలెక్టరేట్‌కి రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్/ meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News April 12, 2026

ఇక ఆన్‌లైన్‌లోనూ ‘మీకోసం’ అర్జీలు: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దరఖాస్తులను ప్రజలు ఇకపై ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని కలెక్టర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.