Anantapur

News September 12, 2024

‘ఉరవకొండ’ పేరు వెనుక ఇదీ చరిత్ర!

image

ఉరవకొండ పేరు వినగానే కొండ గుర్తుకొస్తుంది. పట్టణంలోని ఈ కొండకు ఘన చరిత్రే ఉంది. పాముపడగ ఆకారంలో కొండ ఉండటంతో పూర్వం ఈ పట్టణాన్ని ఉరగాద్రి అని పిలిచే వారట. సంస్కృతంలో ఉరగ అంటే పాము పడగ, అద్రి అంటే కొండ అని అర్థం. కాలక్రమేణా ఉరవకొండగా మారింది. చిక్కన్న అనే పాలేగాడు ఇక్కడ కోట బురుజు నిర్మించుకుని, కొంతకాలం సామంత పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పట్టణం కొండ చుట్టూ అభివృద్ధి చెందుతుండటం విశేషం.

News September 12, 2024

బీటెక్, MBA, MCA, M.SC ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని బీటెక్ సప్లిమెంటరీ (R15, R19), MBA (R17, R21), MCA (R20, R21), M.SC (R20, R21) ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News September 12, 2024

విజయవాడ వరద బాధితుల కష్టాలకు చంద్రబాబే కారణం: కేతిరెడ్డి

image

విజయవాడలో వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడడానికి కారణం సీఎం చంద్రబాబే అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. బుడమేరు కాలువకు అధిక మొత్తంలో వరద రాబోతోందని అధికారులు తెలిపినా పట్టించుకోలేదని అన్నారు. అందుకే వరద ధాటికి లోతట్టు ప్రాంతాలు మునిగాయన్నారు.

News September 12, 2024

ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

image

పుట్లూరు మండలం గాండ్లపాడులో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థిని పావని(19) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. పావని కోయంబత్తూర్‌లో బీటెక్ సెకండియర్ చదువుతోంది. వినాయక పండగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News September 12, 2024

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

బుక్కరాయసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని దయ్యాలకుంటపల్లిలో లక్ష్మీనారాయణ అనే రైతు అప్పుల బాధ తాళలేక బుధవారం సాయంత్రం పొలంలో ఊజీ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు లక్ష్మీనారాయణ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News September 12, 2024

ధర్మవరంలో విషాదం.. కుమారుడి మృతి జీర్ణించుకోలేక తండ్రి సూసైడ్

image

ధర్మవరంలోని ప్రియాంక నగర్‌కు చెందిన వ్యాపారి రజనీ బాబు(50) బుధవారం ఇంట్లో ఉరివేసుకొని మృతిచెందాడు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రజనీ బాబు భార్య రామాంజనమ్మ ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఆమె విధులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రజనీబాబు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. రజనీబాబు కుమారుడు నిశాంత్ ఏడాది కిందట మృతిచెందాడు. కొడుకు మృతి జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

News September 12, 2024

శ్రీ సత్యసాయి: కత్తి, తుపాకీతో నృత్యాలు.. ఏడుగురిపై కేసు నమోదు

image

మడకశిర మండలం గుండుమలలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఏడుగురు యువకులు కత్తి, నాటు తుపాకీ చేత పట్టుకుని నృత్యాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో ఏడుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ రాజు కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి తల్వార్ (కత్తి), నాటు తుపాకీ (రివాల్వర్)ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

News September 12, 2024

అనంత: కార్మికుల పోరాటం.. స్పందించిన పవన్ కళ్యాణ్

image

ఉమ్మడి అనంత జిల్లాలో సత్యసాయి తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న 536 మంది కార్మికులకు ఫిబ్రవరి నుంచి వేతనాలు నిలిచిపోయాయి. దీంతో 21 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు. స్పందించిన డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. వేతనాల కోసం రూ.30 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు.

News September 12, 2024

సేవల బోర్డును ప్రదర్శించాలి: కలెక్టర్ డా.వినోద్ కుమార్

image

అనంతపురం జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో బుధవారం వివిధ శాఖల అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్‌లతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయల వద్ద మండల స్థాయిలో అందే సేవలను బోర్డులో ప్రదర్శించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

News September 12, 2024

అనంతపురంలో క్రికెటర్ల ప్రాక్టీస్

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. హోటళ్ల నుంచి ప్రత్యేక బస్సుల్లో స్టేడియానికి చేరుకున్న ప్లేయర్లు నెట్స్‌లో చెమటోడ్చారు. డీ టీమ్ కెప్టెన్ అయ్యర్ సుమారు గంట పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మిగిలిన ప్లేయర్లు క్యాచింగ్, బంతి త్రో, వ్యాయామం వంటివి చేశారు. ఆటగాళ్లను బయటి వ్యక్తులు కలవకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. గురువారం నుంచి రౌండ్ 2 పోటీలు ప్రారంభం కానున్నాయి.