India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని MP అంబికా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తంచేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందన్నారు. రైతుల పోరాటానికి పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరిగిందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. రాజధానిని ఇక ఎవరూ కదిలించలేరని ఏపీ అభివృద్ధికి ఇది కీలక మలుపు అన్నారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

AP రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని MP అంబికా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తంచేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందన్నారు. రైతుల పోరాటానికి పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరిగిందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. రాజధానిని ఇక ఎవరూ కదిలించలేరని ఏపీ అభివృద్ధికి ఇది కీలక మలుపు అన్నారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

AP రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని MP అంబికా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తంచేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందన్నారు. రైతుల పోరాటానికి పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరిగిందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. రాజధానిని ఇక ఎవరూ కదిలించలేరని ఏపీ అభివృద్ధికి ఇది కీలక మలుపు అన్నారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఫిబ్రవరి నెలలో జరిగిన Pharm.D 1, 2, 3, 4, 5 సంవత్సరాల సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు తమ మార్కుల వివరాలను తెలుసుకోవడానికి https://jntuaresults.ac.in/ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 26 రకాల పెన్షన్స్ పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. వృద్ధులు, వితంతువులు, డిజేబుల్ పెన్షన్స్, క్రోనిక్ డిజేబుల్, తదితర పెన్షన్ లబ్ధిదారులు 2,78,931 ఉన్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ అందజేశారన్నారు.

అనంతపురం జిల్లాలో 102.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మండలాల వారీగా గుత్తిలో 31.2 మి.మీ, కంబదూరులో 34.6 మి.మీ, ఉరవకొండలో 28.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే సెట్టూరు 14.6 మి.మీ, వజ్రకరూరు 5.8 మి.మీ, బ్రహ్మసముద్రంలో 5.0 మి.మీ వర్షపాతం నమోదైంది.

తాడిపత్రిలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు భద్రతే ద్యేయంగా ముందుకు వెళ్తున్నారు. తాడిపత్రి బైపాస్లో టౌన్ సీఐ ఆరోహణరావుతో కలిసి నిబంధనలు పాటించని పలు వాహనదారులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా.. హెల్మెట్లు ధరించని వాహనదారులకు రూ.1,035 జరిమాన విధించారు. హెల్మెట్లు తప్పకుండా ధరించాలని సూచించారు.

పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్బంగా.. సోమవారం అనంతపురం జేఎన్టీయూలోని కళాశాల ఆడిటోరియంలో అవగాహన సదస్సుని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఆనంద్ పాల్గొని మాట్లాడుతూ.. సమాజంలో పేదరికాన్ని నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ స్వప్న, మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు.

ఎల్లనూరు మండలంలో నేడు హీరో విజయ్ దేవరకొండ పర్యటించనున్నారు. మండల పరిధిలోని జంగంపల్లి కోట వద్ద ‘రణబలి’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అందుకు తగ్గ ఏర్పాట్లను సిద్ధం చేశారు. పుట్లూరు సీఐ సత్యబాబు బందోబస్తు చేపట్టారు.

ఎల్లనూరు మండలంలో నేడు హీరో విజయ్ దేవరకొండ పర్యటించనున్నారు. మండల పరిధిలోని జంగంపల్లి కోట వద్ద ‘రణబలి’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అందుకు తగ్గ ఏర్పాట్లను సిద్ధం చేశారు. పుట్లూరు సీఐ సత్యబాబు బందోబస్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.