Anantapur

News March 24, 2026

గుత్తి కోటకు నడక మెట్లు ఏర్పాటుకు సీఎం అనుమతి: కలెక్టర్

image

జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గుత్తి కోటకు సంబంధించి నడక మెట్లు ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇవ్వడం జరిగిందని, మెట్ల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ అంశాన్ని అజెండాలో పొందుపరచాలని పేర్కొన్నారు.

News March 23, 2026

అనంతపురంలో పీజీఆర్ఎస్‌కు 111 అర్జీలు

image

అనంతపురం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీశ్ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి 111 పిటిషన్లను స్వీకరించారు. ఆయన ప్రతి పిటిషనర్‌తో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్నారు. ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి, చట్టపరిధిలో సత్వర పరిష్కారం చూపాలంటూ సంబంధిత పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

News March 23, 2026

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు వేగవంతం: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. శిల్పారామంలో మౌలిక వసతులు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. గుత్తి, కుందుర్పి కోటల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. అనంతసాగరం చెరువులో బోటింగ్ ప్రారంభించాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మరుగుదొడ్లు, సమాచారం బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News March 23, 2026

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు వేగవంతం: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. శిల్పారామంలో మౌలిక వసతులు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. గుత్తి, కుందుర్పి కోటల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. అనంతసాగరం చెరువులో బోటింగ్ ప్రారంభించాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మరుగుదొడ్లు, సమాచారం బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News March 21, 2026

అనంతపురంలో బీజేపీ ‘SIR’ జిల్లా సన్నాహక సమావేశం

image

అనంతపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం SIRపై సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రాజేశ్ కురుబ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా రాష్ట్ర మీడియా ప్రతినిధి మధుసూదన్, కార్యదర్శి శ్రీనివాసులు, చిరంజీవి రెడ్డి హజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీదేవి పాల్గొన్నారు.

News March 21, 2026

అనంత: ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వజ్రకరూరు మండలం పీసీ కొత్తకోటలో బావిలో ఈతకు వెళ్లిన బాలుడు మృతి చెందాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్(13) స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా పూడికలో ఇరుక్కొని నీటిలో మునిగిపోయాడు. స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొనగా, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News March 21, 2026

అనంత: ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వజ్రకరూరు మండలం పీసీ కొత్తకోటలో బావిలో ఈతకు వెళ్లిన బాలుడు మృతి చెందాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్(13) స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా పూడికలో ఇరుక్కొని నీటిలో మునిగిపోయాడు. స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొనగా, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News March 21, 2026

అనంత: ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వజ్రకరూరు మండలం పీసీ కొత్తకోటలో బావిలో ఈతకు వెళ్లిన బాలుడు మృతి చెందాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్(13) స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా పూడికలో ఇరుక్కొని నీటిలో మునిగిపోయాడు. స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొనగా, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News March 21, 2026

అనంత జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో వినిపించేలా చేశారు: MLA

image

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి వివిధ రంగాల్లో రాణిస్తూ అనంతపురం జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో వినిపించేలా చేశారని పురస్కారాల గ్రహీతలను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభినందించారు. ఉగాది సందర్భంగా రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఇందులో అనంతపురం జిల్లా నుంచి ముగ్గరికి స్థానం లభించింది.

News March 21, 2026

అనంత: టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్

image

అనంతపురం JNTU 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్ 6న నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్నాతకోత్సవ గౌరవ డాక్టరేట్‌ను ‘Missile Woman of India’గా పిలవబడే DRDO మాజీ డైరెక్టర్ జనరల్ టెస్సీ థామస్‌కు ఇవ్వనున్నారు. ఆమె గతంలో అగ్ని-IV, అగ్ని-V క్షిపణులకు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. దేశంలోని క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్త కూడా ఈమె కావడం విశేషం.