Anantapur

News August 31, 2024

ATP: రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని రేకుల కుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. వచ్చే ఐదు రోజులూ పగటి ఉష్ణోగ్రతలు 32.0 నుంచి 35.0 డిగ్రీలుగా, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుంచి 23.8 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాగా రెండ్రోజులుగా జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తోంది.

News August 31, 2024

గుంతకల్లులో రైల్వే మహిళా ఉద్యోగి ఇంట్లో చోరీ

image

గుంతకల్లు పరిధి శాంతినగర్ రైల్వే క్వార్టర్స్‌లో రైల్వే డివిజనల్ మెడికల్ ఆఫీసర్ హరిత ఇంట్లో చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో జత బంగారు కమ్మలు, వెండి వస్తువులు, కొంత నగదును దుండగులు చోరీ చేసినట్లు ఒకటో పట్టణ పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 25న ఇంటికి తాళం వేసుకొని సొంత పనులపై తిరుపతి వెళ్లారు. 29న సాయంత్రం ఇంటికి వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News August 31, 2024

సెప్టెంబర్ 11 నుంచి ఉచిత ఇసుకకు నూతన విధానం

image

సెప్టెంబర్ 11 నుంచి ఆన్లైన్ ద్వారా ఉచిత ఇసుకకు నూతన విధానం అమలు చేయనున్నట్లు రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం రాత్రి సచివాలయంలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా అధికారులతో మాట్లాడారు. ఇసుకకు సంబంధించిన ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 5994599ను విస్తృతంగా ప్రచారం చేయాలని మీనా ఆదేశించారు.

News August 30, 2024

అన్ స్టాప‌బుల్ హీరో మా బాల మామ‌య్య: లోకేశ్

image

హిందూపురం MLA, హీరో బాలకృష్ణ 50ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడంతో మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు. ‘1974లో తెరంగేట్రం చేసిన మామ‌య్య వేయ‌ని పాత్ర లేదు. చేయ‌ని ప్రయోగం లేదు. 109 సినిమాల‌లో న‌టించి అవార్డులు, రివార్డులతో రికార్డు సృష్టించారు. అగ్ర హీరోగా వెలుగొందుతూనే రాజ‌కీయాల్లో రాణిస్తూ సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలుచుకున్న అన్ స్టాప‌బుల్ హీరో మా బాల మామ‌య్య’ అని ట్వీట్ చేశారు.

News August 30, 2024

అనంతపురంలో దులీప్ ట్రోఫీ.. రేపు పాసుల జారీ

image

అనంతపురంలో సెప్టెంబర్ 5 నుంచి జరగనున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లను తిలకించడానికి రేపు ఫ్రీ పాసులు జారీ చేయనున్నారు. నగరంలోని ఆర్డీటీ క్రికెట్‌ గ్రౌండ్‌లో రోజుకు కేవలం 4,100 పాసులు మాత్రమే జారీ చేస్తారు. పాసు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తారు. కాగా నగరంలోని రెండు మైదానాల్లో రోజుకు రెండు మ్యాచ్‌లు జరగనుండగా ప్రేక్షకులు తిలకించడానికి ఏ-మైదానంలో మాత్రమే సౌకర్యం ఉంది. బీ-మైదానంలో కూర్చోడానికి సౌకర్యం లేదు.

News August 30, 2024

దుండగుల అరాచకం.. మహిళ గొలుసు, కమ్మలు లాక్కెళ్లారు

image

రొళ్ల మండలంలో మహిళ కమ్మలు, మెడలోని గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు. జీబీహల్లి గ్రామంలో తిమ్మమ్మ అనే మహిళ తన పొలంలో పశువులను మేపుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని గోల్డ్ చైన్, చెవి కమ్మలను బలవంతంగా లాక్కొని పరారయ్యారు. గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు గమనించి మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News August 30, 2024

ఉరవకొండ డిగ్రీ ప్రభుత్వ కళాశాల మరో ఘనత

image

ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరో ఘనత సాధించింది. న్యాక్ ‘A’ గ్రేడ్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన కళాశాల భోదన, భోదనేతర సిబ్బందికి, విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. ‘A’ గ్రేడ్ రావడం కళాశాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

News August 30, 2024

మొక్కలు నాటిన మంత్రి, కలెక్టర్

image

వన మహోత్సవం పురస్కరించుకుని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మొక్కలు నాటారు. పెనుకొండ మండలం పరిధిలోని పులేకులమ్మ ఆలయ సమీపంలో శనివారం ఉదయం మంత్రి సవిత మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటిన మొక్కలు సంరక్షించి వృక్షాలుగా పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు.

News August 30, 2024

ప్రజా నాయకుడు పరిటాల రవీంద్ర: మంత్రి నారా లోకేశ్

image

పేదల సంక్షేమం కోసం, రాయలసీమ ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రజా నాయకుడు పరిటాల రవీంద్ర అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. నేడు దివంగత మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా ‘X’ వేదికగా లోకేశ్ నివాళులు అర్పించారు.

News August 30, 2024

అనంత: ఉప్పు సత్యాగ్రహి మృతి

image

ఉరవకొండకు చెందిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న శతాధిక వృద్ధురాలు సావిత్రమ్మ(101) గురువారం ఆమె స్వగృహంలో అనారోగ్యంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమె భగవద్గీత శ్లోకాలను, వాటి తాత్పర్యాలు సులువుగా నోటితో చెప్పగల సమర్థురాలు. జాతిపిత మహాత్మా గాంధీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహాన్ని విజయవంతం చేయడంలో కృషిచేశారు.