India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు కృషి చేయాలని, పోలీస్ శాఖపై ప్రజలలో విశ్వసనీయత పెంచే విధంగా చూడాలని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు హత్యలు, రహదారి ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి సాగు, అమ్మకాలపై ఉక్కు పాదం మోపాలని ఎక్సైజ్ అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును, అమ్మకాలను నియంత్రించాలని అధికారులకు సూచించారు.
అనంత జిల్లాలో కొత్తగా తొమ్మిది ఎఫ్ఎం రేడియో స్టేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా 234 నగరాలు, పట్టణాల్లో ఎఫ్ఎం రేడియోను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం తెలిపింది. అందులో భాగంగా జిల్లాకు 9 ఎఫ్ఎం రేడియో స్టేషన్లను కేటాయించారు. జిల్లాలోని అనంతపురంలో 3, గుంతకల్లులో 3, తాడిపత్రిలో 3 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరా మిరెడ్డి ప్రభుత్వ అధికార చిహ్నంతో కూడిన లెటర్ ప్యాడ్ను ఇద్దరు వైసీపీ నాయకుల సస్పెన్షన్ ఉత్తర్వులకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని ధర్మవరం మండలం తిప్పేపల్లికి చెందిన హైకోర్టు న్యాయవాది అంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నీరణ్ కుమార్కు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్కు ఫిర్యాదు చేశానన్నారు.
అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్లో బుధవారం 3,800 టన్నులు టమాటాను రైతులు తీసుకొచ్చారు. 28 మండీల్లో టమాటా విక్రయాలు కొనసాగాయి. ఉదయం వేలం పాటలు నిర్వహించారు. కిలో గరిష్ఠంగా రూ.23, మధ్యస్థం రూ.15, కనిష్ఠం రూ.6 చొప్పున ధరలు పలికాయి. 15 కిలో బుట్ట ధర పరిశీలిస్తే గరిష్ఠ ధర రూ.345, మధ్యస్థం రూ.225, కనిష్ఠం రూ.90 చొప్పున ధరలు పలికాయని మార్కెట్ ఇన్ఛార్జ్ రాంప్రసాద్ రావు తెలిపారు.
రొద్దం మండలం వైఎస్ఆర్ సర్కిల్లో ప్రధాన రహదారి పక్కనే మరమ్మతుల నిమిత్తం 4 రోజుల క్రితం అధికారులు కాలువ తీయించి దానిని అలాగే వదిలేశారు. నిత్యం రద్దీగా ఉన్న ఈ ప్రాంతంలో ఇంత లోతు గుంత తీయించిన అధికారులు అక్కడ కనీసం ప్రమాద సూచికను ఏర్పాటు చేయకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మలుపు ఉండటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి గుంత పూడ్చాలని కోరారు.
రైతులకు హాని చేస్తున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని, దందా ఏ రూపంలో ఉన్నా జరగనివ్వనని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం అనంతపురంలో ఎస్పీ జగదీశ్ను కలిసిన అనంతరం మాట్లాడారు. లారీలను పట్టుకున్న తమ కార్యకర్తలపై మాఫియా గ్యాంగ్ దాడి చేస్తే స్పందించక పోగా, రాజీ కావాలని సీఐ లక్ష్మీకాంత్రెడ్డి పట్టించుకోలేదన్నారు. భయపెడుతున్నాడని ఆరోపించారు.
సత్యసాయి జిల్లాలోని అన్ని పరిశ్రమలలో ప్రమాదాల నివారణపై అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల నిర్వహణ, ప్రమాదాల నియంత్రణపై అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో భద్రతా చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.
అనంతపురం పట్టణ సమీపంలోని ఆర్డీటీ స్టేడియాన్ని జిల్లా ఎస్పీ జగదీశ్ అధికారులతో కలిసి సందర్శించారు. స్టేడియంలో సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు దులీప్ ట్రోఫీ మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ నిర్వహించాల్సిన భద్రత గురించి అధికారులు, స్టేడియం నిర్వహకులతో చర్చించారు. సుమారు 50 మందికిపైగా భారత క్రికెటర్లు నగరానికి వస్తుండటంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉరవకొండలో తీవ్ర విషాదం నెలకొంది. పుట్టిన రోజు నాడే జ్వరంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. పట్టణంలోని 1వ వార్డుకు చెందిన హోంగార్డ్ బాబా ఫక్రుద్దీన్ కుమారుడు అజీమ్ షేక్(14) తీవ్ర జ్వరంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం మృతిచెందాడు. పుట్టిన రోజు నాడే మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Sorry, no posts matched your criteria.