India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాలో 76 ఓపెన్ డ్రింకింగ్, 44 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై 626 ఎంవీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రూ.2,27,046 జరిమానాలు విధించామన్నారు. 42 పోలీసు స్టేషన్ల పరిధిలో అక్కడి పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి, వాహనాల తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో తనిఖీలు నిర్వహించి 53 డ్రంకన్ డ్రైవ్ కేసులు, 93 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆగస్టు 10 వరకు జిల్లాలో డ్రంకన్ డ్రైవ్పై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని వెల్లడించారు.

గుంతకల్లు సోఫియా వీధికి చెందిన షమీం భాను(35) తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని, బ్లాక్ లిస్టులో పెట్టాడని మనస్తాపంతో పురుగుమందు తాగి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. భాను మొదటి భర్తకు విడాకులు ఇచ్చి గుంతకల్లు సచివాలయ వీఆర్ఓ మహమ్మద్ వలిని గతేడాది వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం తన నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టడంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతపురం తరలిస్తుండగా మృతిచెందింది.

వృద్ధ రైతు కళ్లలో కారం పొడి చల్లి రూ.30 వేలు చోరీ చేసిన ఘటన బ్రహ్మసముద్రం మండలం మాముడూరులో బుధవారం చోటుచేసుకుంది. పొలంలో ఉండగా గుర్తు తెలియని దుండగులు కళ్లలో కారం పొడి చల్లి తన వద్ద ఉన్న రూ.30 వేలు చోరీ చేశారని బాధిత రైతు భూతప్ప తెలిపారు. నెలనెలా పోగేసుకున్న పింఛన్ డబ్బులు మొత్తం దోచుకెల్లారని వాపోయారు. ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు.

నిధుల పెంపు & GST మినహాయింపు కోసం లోక్ సభలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి కొరత, రహదారి లేమి, అభివృద్ధి లోపాలు వంటి సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. MPLADS కింద ఎంపీకి రూ.10 కోట్లకు పెంచాలన్నారు. MPLADS పనులకు పూర్తిగా GST మినహాయింపు ఇవ్వాలని కోరారు. MPLADSలో తక్షణ మార్పులు చేపట్టాలన్నారు.

అనంతపురంలోని గుత్తి రోడ్లో ఉన్న సెంట్రల్ బ్యాంకు అటెండర్ రవి (35) బుధవారం బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యాంకు సిబ్బంది విషయాన్ని కుటుంబ సభ్యులు, పోలీసులకు తెలిపారు. అప్పుల బాధ తాళలేక రవి మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల అంశాలకు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లో పంచాయతీ సెక్టార్, GSWS తదితర అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ సిటిజన్ ఫీడ్ బ్యాక్ను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు.

ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మరో విశిష్ట గుర్తింపు లభించింది. విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మిషన్ మాలవ్య ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంను విశ్వవిద్యాలయ క్యాంపస్లో ఏర్పాటు చేయడానికి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం వీసీ కోరి ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ఉన్నత విద్యా సంస్థల అధ్యాపకులకు ఆధునిక, నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రధాన వేదికగా పని చేయనుందన్నారు.

బ్యాంకులు, ATM కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాలు, సైబర్ నేరాల పట్ల కస్టమర్లను అప్రమత్తం చేయాలని బ్యాంకు అధికారులకు SP జగదీశ్ సూచించారు. అనంతపురంలోని ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని బ్యాంకు అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంక్, ATMల వద్ద 24X7 రికార్డు అయ్యే దృశ్యాలు క్లారిటీగా కనిపించేలా HD కెమెరాలను అమర్చాలన్నారు. వాటి డేటా క్లౌడ్ స్టోరేజీలో నిక్షిప్తం చేయాలన్నారు.

పోలీసుల దురుసు ప్రవర్తనతో మనస్తాపానికి గురై బుక్కరాయసముద్రం (M) రెడ్డిపల్లికి చెందిన బాలకృష్ణ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం అనంతపురం SP కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. బాధితుడు మాట్లాడుతూ.. రూ.15 లక్షలు అప్పు తీర్చలేక పోలీసు ఉన్నతాధికారులకు సమస్య వివరించానన్నాడు. ఈ క్రమంలో పోలీసులు దూషించారన్నాడు. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని వాపోయాడు.
Sorry, no posts matched your criteria.