India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతలో దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీలు 5వ తేదీ నుంచి జరగనున్నాయి. ఇండియా క్రికెటర్లు 4 జట్లుగా విడిపోయి 3 రౌండ్లలో 19వ తేదీ వరకు మ్యాచ్లు ఆడనున్నారు. 5న బెంగళూరులో AvsB మధ్య మ్యాచ్ ఏర్పాటు చేయగా మిగతావన్నీ అనంతపురంలో CvsD, 12నAvsD, BvsC, 19న AvsC, BvsD జట్లు ఆడే విధంగా షెడ్యూల్ విడుదల చేశారు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు కెప్టెన్లుగా ఉన్నారు.
తాడిపత్రిలోని ప్రభుత్వ కస్తూరిబా గాంధీ జనరల్ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ కింద పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ మునెమ్మ పేర్కొన్నారు. కెమిస్ట్రీ సబ్జెక్టు పోస్టు ఒకటి, గెస్ట్ కుక్స్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పాఠశాలలో సంప్రదించాలని కోరారు.
అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21న ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు.
అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పామిడికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి తాకీర్ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందినట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పామిడి నుంచి గుత్తిలోని కళాశాలకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
అనంతపురం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దాదాపు 196 హెక్టార్లలో పంట నష్టం జరిగి ఉంటుందని అంచనాలు వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారిని ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం మొక్కజొన్న- 89 (హెక్టార్లలో), కంది, వేరుశెనగ-22, ఉద్దులు -15, పత్తి -14, వరి-12, సోయాబిన్-8, 4 హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. ఫలితంగా సుమారు రూ.53లక్షల నష్టం అంచనా వేశామన్నారు.
మాన్యువల్ స్కావెంజర్ల జిల్లా సర్వే కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులను అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ కోరారు. సర్వే కమిటీ ఏర్పాటుకు నలుగురు సభ్యులు ఉంటారన్నారు. ఆసక్తి గలవారు తమ పూర్తి వివరాలతో ఈనెల 21వ తేదీ లోగా అనంతపురంలోని దామోదరం సంజీవయ్య భవనంలో ఉన్న జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ, సాధికారత కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని కోరారు.
పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాలు నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. సత్యసాయి ట్రస్ట్ వర్గాలతో సంప్రదించి త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాను హిందూపురానికి మార్చితే పోరాటాలకు సిద్ధమని టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మారుతీ రెడ్డి శనివారం అన్నారు. పుట్టపర్తిలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఏర్పాటైన తర్వాత ఇలా బాలకృష్ణ కామెంట్స్ చేయడం చాలా దారుణమన్నారు. అసలు జిల్లాను మార్చాలనే అలోచన ఎందుకు వచ్చిందో బాలకృష్ణ చెప్పాలన్నారు. ఇక్కడ లేనివి, హిందూపురంలో ఉన్నవి ఏమిటో కూడా చెప్పాలన్నారు. బాలకృష్ణ ఆలోచన మార్చుకోవాలన్నారు.
రానున్న ఏడాదికి 15శాతం వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళిక సిద్ధం చేయాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీలతో ఆంధ్ర-2047 జిల్లా యాక్షన్ ప్లాన్పై సమావేశం నిర్వహించారు.
పుట్టపర్తి-ధర్మవరం మధ్య రాకపోకలు ప్రారంభమైనట్లు పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొత్తచెరువు మండల పరిధిలోని కేశవరం వద్ద వంకపేరు వరద నీటి ప్రవాహానికి రాకపోకలు స్తంభించాయి. మరమ్మతుల అనంతరం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశాల మేరకు రాకపోకలు ప్రారంభించినట్లు ఆర్డీవో పేర్కొన్నారు. కొన్నిచోట్ల వాగుల్లో వరద ఉద్ధృతి తగ్గడంతో రాకపోకలు ప్రారంభమైయ్యాయి.
Sorry, no posts matched your criteria.