Anantapur

News February 24, 2025

అనంతపురం జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

☞ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు 
☞ అనంత జిల్లాలో 48,690 మంది <<15560376>>ఇంటర్ విద్యార్థులు<<>>
☞ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం- ఎంపీ 
☞ అనంతపురం కలెక్టరేట్లో అర్జీలు స్వీకరించిన జేసీ
☞ రాప్తాడులో చెరువులను నీటితో నింపండి – ఎమ్మెల్యే 
☞ గుత్తిలో క్రషర్ మిషన్‌లో పడి <<15564856>>యువకుడి మృతి<<>>
☞ అనంతపురంలో హత్య.. ఐదుగురికి <<15562592>>జీవిత ఖైదు<<>>

News February 24, 2025

ATP: PGRS కార్యక్రమంలో 502 అర్జీలు

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పాల్గొని ప్రజల నుంచి 502 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ PGRS అర్జీలను సంబంధిత గడువులోపే పరిష్కరించాలని, ఎలాంటి పెండింగ్ ఉంచరాదని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులంతా జవాబుదారీతనంతో అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం చూపొద్దని వివరించారు.

News February 24, 2025

అనంతపురం జిల్లాలో హత్య.. ఐదుగురికి జీవిత ఖైదు

image

అనంతపురం జిల్లా నార్పలకు చెందిన మట్టి పవన్ కుమార్ హత్య కేసులో ఐదుగురికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ సోమవారం సంచలన తీర్పు చెప్పారు. 2022లో స్నేహితుల మధ్య విభేదాలతో దాడి జరగ్గా పవన్ మృతి చెందారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు దఫాల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో జీవిత కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

News February 24, 2025

అనంతపురానికి సరైన బెర్త్ దక్కేనా?

image

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉరవకొండ నుంచి 5వసారి గెలుపొంది తొలిసారి క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్ ఈ నెల 28న కూటమి ప్రభుత్వ తొలి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మన జిల్లా నేత బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరి పయ్యావుల పద్దులో అనంతపురం జిల్లాకు సరైన బెర్త్ దక్కేనా?

News February 24, 2025

అనంతపురం జిల్లాలో 48,690 మంది ఇంటర్ విద్యార్థులు

image

మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అనంతపురం జిల్లాలో 48,690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం 25,730 మంది, రెండో సంవత్సరం 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

News February 24, 2025

ఇండియా-పాక్ మ్యాచ్‌‌లో జేసీ పవన్

image

టీడీపీ సీనియర్ నేత జేసీ పవన్ రెడ్డి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జరిగిన టీమ్ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌‌ను తిలకించారు. తన స్నేహితులతో కలిసి గ్రౌండ్‌లో సందడి చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే మ్యాచ్‌ను చూడటానికి మంత్రి నారా లోకేశ్, పలువురు ఎంపీలు వెళ్లిన విషయం తెలిసిందే.

News February 23, 2025

అనంతపురం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు ఇవే..!

image

☞ అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు – కలెక్టర్ వినోద్ కుమార్ ☞ పెద్దపప్పూరులో అశ్వర్థం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు ☞ అనంతపురం రూరల్‌లో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సునీత భూమి పూజ☞ గుత్తిలో ఇరు వర్గాలు ఘర్షణ ☞ కుందుర్పిలో గడ్డివాములు దగ్ధం ☞ గార్లదిన్నె మండలంలో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు☞ తాడిపత్రిలో సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి

News February 23, 2025

6,463 మంది పరీక్షలు రాశారు: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లాలోని 14 సెంటర్లలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 7,293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. అందులో 6,463 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, 830 మంది అభ్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. 88.61% ప్రజెంట్ పోల్ అయినట్లు ఆయన తెలిపారు.

News February 23, 2025

చెన్నేకొత్తపల్లి: పాము కాటుకు గురై చిన్నారి మృతి

image

చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురానికి చెందిన ప్రీతి అనే మూడో తరగతి విద్యార్థిని శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందారు. శనివారం రాత్రి ప్రీతి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా.. నాగుపాము కాటు వేయడంతో ఆమెను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విద్యార్థిని తల్లితండ్రులు తెలిపారు.

News February 23, 2025

అనంతపురంలో కిలో చికెన్ రూ.120

image

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అనంతపురంలో ఇవాళ కిలో చికెన్ రూ.120-140 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.350-400, మటన్ కిలో రూ.700-800లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.