India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నుంచి అనంతపురం వెళ్లే బస్సుల రాకపోకలు మళ్లించినట్లు పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ తెలిపారు. భారీ వర్షం కారణంగా కొత్తచెరువు మండలంలోని కేసాపురం సమీపంలో వంక పేరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తచెరువు నుంచి పెనుకొండ మీదుగా ధర్మవరం, అనంతపురానికి బస్సులు తిప్పుతున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేడు జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు పలికింది. అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మనోరంజన్ రెడ్డి, అభిషేక్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నగరం లోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీడీ సేవలు, అత్యవసరం కాని శస్త్రచికిత్స పూర్తిస్థాయిలో నిలిపివేస్తామన్నారు.
హిందూపురంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజతో పాటు 12 మంది వైసీపీ కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ జిల్లా సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఓ ప్రకటనలో తెలిపారు. వారు టీడీపీలో చేరడంతో పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్సీఓఆర్డీ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని ఎస్పీ కేవీ మురళీకృష్ణతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా చేపట్టాలన్నారు.
అనంతపురం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మురళీకృష్ణ బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ ఆయనను ఏపీఎస్పీ విశాఖపట్నం 16వ బెటాలియన్కు బదిలీ చేసింది. అయితే అనంతపురం జిల్లాలో అతి తక్కువ కాలం పని చేసిన ఎస్పీ జాబితాలో మురళీకృష్ణ, అమిత్ బర్దర్, గౌతమి శాలీ ఉన్నారు.
పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విజన్ 2047పై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందని, అందుకు సంబంధించి జిల్లాలో వివిధ శాఖల 100 డాక్యుమెంట్ కు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చే విధంగా విజన్ తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అనంత: ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, అందుకే బీసీలకు మాత్రమే డీఎస్సీ కోచింగ్ ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులను పక్కన పెట్టిందని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇవ్వాలని కోరుతూ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారికి వినతిపత్రం అందజేశారు.
రామగిరి మండలం ముత్యాలంపల్లి సమీపంలోని పరిటాల సునీత సొంత వ్యవసాయ పొలంలో కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. ఇందులో భాగంగా పొలం దగ్గర ఏర్పాటు చేసిన గంగ పూజలో పాల్గొన్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు, కూలీలు ఉన్నారు.
అనంతపురం జిల్లా దేశవాళీలో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ అమిత్ సిద్దేసర్ ఇటీవల అనంత క్రీడా మైదానాన్ని సందర్శించారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి 22 వరకు 4మ్యాచ్లు జరగనున్నాయి. సూర్యకుమార్ యాదవ్, రుతు రాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, అక్షర పటేల్, కేఎల్ రాహుల్, కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా రానున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ అనంతపురంతో పాటు శ్రీసత్యసాయి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంతకీ మీ ఊరిలో ఇప్పుడు వాతావరణం మారిందా? లేదా? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.