Anantapur

News August 5, 2024

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంఘం త్రిసభ్య కమిటీ సభ్యుడిగా ఆర్డీటీ పీడీ

image

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంఘం త్రిసభ్య కమిటీ సభ్యుడిగా ఆర్డీటీ పీడీ మంచో ఫెర్రర్‌ను నియమించారు. ముగ్గురితో కూడిన కమిటీని నియమించారు. అందులో గుంటూరు నుంచి మురళీమోహన్, బొబ్బిలి రంగారావు, అనంతపురం ఆర్డీటీ మంచో ఫెర్రర్‌ను నియమించారు. గతంలో ఈయన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా చేశారు. మంచో ఫెర్రర్ ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

News August 5, 2024

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: జేసీ

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

News August 4, 2024

శ్రీ సత్యసాయి: రైలు కిందపడి యువకుడి దుర్మరణం

image

ధర్మవరం పట్టణం తారక రామాపురానికి చెందిన ఎం.మహేశ్(24) ఈనెల మూడో తేదీ అర్ధరాత్రి సమయంలో రైలు కిందపడి మృతిచెందాడు. ధర్మవరం జీఆర్‌పీ పోలీసులు మాట్లాడుతూ.. మృతుడు జులాయిగా తిరుగుతూ, ఏ పనీ చేయకుండా తల్లి మీదే ఆధారపడి ఉండేవాడన్నారు. తాగుడుకు బానిసై తల్లిని డబ్బు కోసం వేధించేవాడని, తల్లి మద్యం మానమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News August 4, 2024

వీరిది చిరకాల స్నేహం

image

స్నేహం ఒక మధుర జ్ఞాపకం. బాల్యం నుంచి సాగే జీవన పోరాటంలో ఎంతోమంది మనతో కలిసున్నా కొద్ది మంది మాత్రమే చివరి వరకు తమ స్నేహాన్ని కొనసాగిస్తారు. అనంతపురం JNTU పూర్వ విద్యార్థులు వైశాలి, అరుణకాంతి, అజిత, భవానీ నేటికీ తమ స్నేహాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం వారంతా అక్కడే ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. ఎలాంటి సందర్భంలోనైనా ఒకరికొకరు అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు.#FriendshipDay

News August 4, 2024

అనంత: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై పోక్సో కేసు

image

రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం గ్రామానికి చెందిన మధుకుమార్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఓ యువతిని పెళ్లి చేసుకున్న మధుకుమార్ ప్రేమ పేరుతో మరో బాలికను మోసం చేసినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ‘14 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. బాలిక గర్భం దాల్చి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం’ అని వివరించారు.

News August 4, 2024

నిత్యావసర సరకుల పంపిణీని సజావుగా చేపట్టాలి: కలెక్టర్

image

ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీని సజావుగా చేపట్టాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని ఓల్డ్ టౌన్‌లో ఉన్న 9వ వార్డులో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యావసర సరకుల పంపిణీని చేపట్టాలని ఆదేశించారు.

News August 3, 2024

పెనుకొండ వద్ద 15 మంది అరెస్ట్

image

పెనుకొండ వద్ద పేకాట స్థావరంపై దాడి చేసి 15 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బాజీ ఖాన్ సైదా తెలిపారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, రూ.17.10 లక్షల నగదు, 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. బెంగళూరు, కడప, కర్నూల్ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చిందని డీఎస్పీ తెలిపారు. దాడి చేసి శెట్టిపల్లి ప్రాంతంలో 15 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

News August 3, 2024

బండారు శ్రావణికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

image

ఎమ్మెల్యే బండారు శ్రావణికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు బర్త్ డే విషెస్ చెబుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పుట్లూరు, నార్పల, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, ఎల్లనూరు మండలాల్లో టీడీపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ వంటివి పంపిణీ చేశారు. 1990 ఆగస్టు 3న జన్మించిన శ్రావణి ఈ ఎన్నికల్లో తొలిసారి MLA అయిన విషయం తెలిసిందే.

News August 3, 2024

అనంత జిల్లాకు 40 మంది తహశీల్దార్లు బదిలీ..!

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల బదిలీలలో కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు తిరిగి సొంత జిల్లాకు వచ్చారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తహశీల్దార్లకు ఆయా మండలాల వారీగా స్థానాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే వారికి కేటాయించిన స్థానాలలో జాయిన్ కావాలని సూచించారు.

News August 3, 2024

REWIND: ధర్మవరం : రోడ్డు ప్రమాదాలలో 21మంది మృతి

image

ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రోడ్డు ప్రమాదాలలో 21 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద కేసులు 30 నమోదవ్వగా .. 24 మంది గాయపడ్డారన్నారు. వీరిలోనూ 30 నుంచి 40 ఏళ్లలోపు వయసు వారే ఉన్నారని ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించలేదని వివరించారు. ఒక వేళ హెల్మెట్ పెట్టుకుని ఉంటే బ్రతికేవారేమోనని అభిప్రాయపడ్డారు.