India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వపక్షంలోనే విపక్షం తయారైందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని వైద్య, ఆరోగ్య సమస్యలు చెప్పారు. అది మంచిదే. ప్రజారోగ్యం గురించి ఆలోచించి వారి నియోజకవర్గాల్లోని సమస్యలు చెప్తున్నారు. అధ్యక్షా.. గత ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో అవినీతికి పాల్పడింది. నియామకాల్లో రాజకీయ జోక్యంతో అవకతవకలకు పాల్పడింది’ అని అన్నారు.
సమష్టిగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచిపేరు తేవాలని ఎస్పీ కేవీ మురళీకృష్ణ అన్నారు. అనంతపురంలోని పరేడ్ మైదానంలో శుక్రవారం ఏఆర్ సాయుధ బలగాలు, హోంగార్డులు నిర్వహించిన పరేడ్ను ఎస్పీ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడాతూ.. పరేడ్ బాగా చేశారన్నారు. యూనిఫాం సర్వీస్లో ఏఆర్, హోంగార్డులు, సివిల్ పోలీసులతో పాటు ప్రాధాన్యతగా సేవలు అందిస్తున్నారన్నారు.
ధర్మవరం మండలం ఎర్రగుంటకు చెందిన ముంతాజ్ బేగం(48) గురువారం వాటర్ హీటర్ తగిలి మృతిచెందారు. స్నానం చేయడానికి బకెట్లో నీళ్లు పోసి హీటర్ వేశారు. నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నించగా కరెంటు షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. ఆమెకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముంతాజ్ బేగం భర్త మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నారు.
అనంతపురం జిల్లా జూనియర్ షూటింగ్ బాల్ జట్ల ఎంపిక పోటీలను ఆదివారం అనంతపురం పట్టణం సెయింట్ జోసెఫ్ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి అమరేంద్ర యాదవ్ తెలిపారు. 16 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.
అనంతపురంలోని నాలుగవ రోడ్డులో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగరపాలక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పుస్తకాలు, మొక్కలు పంపిణి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్నప్పటి నుంచి సామాజిక సేవల పట్ల అవగాహన ఉండాలని, నలుగురికి సహాయం చేసే వ్యక్తిత్వం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
అనంతపురం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో జిల్లాస్థాయి మాతా శిశు మరణాల సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగింది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు జరిగిన 17 మాతృ మరణాలలో 6 కేసులను సమీక్ష చేశారు. జిల్లాలో జరిగిన మాతృ మరణాలకు గల కారణాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈబీ దేవి వివరించారు. మాతృమరణాలు నివారించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇండియా కూటమితో పొత్తు కోసమే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లినట్లుగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చారని, ఇక శాసన సభకు వస్తే బాగుంటుందని అన్నారు. జగన్ ఢిల్లీ వేదికగా చెప్పిన రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలు సభలో పెట్టాలన్నారు.
అనంతపురం ప్రభుత్వం మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మాణిక్య రావు గురువారం తెలిపారు. కళాశాలలో 69 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. అందులో DMLT-10, DOA-10, DANS-30, DMIT-10, DECG-3, DRGA-3, DDRA-3 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 6వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
చెన్నెకొత్తపల్లి మండలంలోని వెల్దుర్తి గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20తేదీన ధర్మవరం మండల పరిధిలోని సీసీ కొత్తకోట వద్ద సూర్యనారాయణ అనే వ్యక్తిని సమీప బంధువులు ఆస్తి తగదాల కారణంగా హత్య చేశారు. గ్రామ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని హత్యకు కారకులైన వారిని గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనపై స్పందించిన ఎస్సై వెంకటేశ్వర్లు స్థానికులతో చర్చించారు.
అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న పారామెడికల్ కోర్సులకు ఆగస్టు 6వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మాణిక్యాలరావు తెలిపారు. డీఎంఎల్డీ 10సీట్లు, డీఓఏ 10, డీఏఎన్ఎస్ 30, డీఎంఐటీ 10, డీఈసీజీ 3, డీఆర్జీఏ 3, డీడీఆర్ఏ 3 మొత్తం 69 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇంటర్మీడియట్లో బైపీసీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
Sorry, no posts matched your criteria.