India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సత్యసాయి జిల్లాలో జరుగుతున్న మొహర్రం వేడుకలు అందరూ సోదర భావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రత్న సూచించారు. మొహర్రం వేడుకలలో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు వెళ్లకుండా అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో ఉండాలన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు.
సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న 16మంది ఎస్ఐలు తిరుపతి జిల్లాకు బదిలీ చేస్తూ బుధవారం జిల్లా ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పని చేస్తున్న 24మంది సత్యసాయి జిల్లాకు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు బదిలీలు చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. బదిలీ అయిన వారు త్వరలో విధుల నుంచి రిలీవ్ కానున్నట్లు తెలుస్తోంది.
మిషన్ వాత్సల్య పథకం ద్వారా సత్యసాయి జిల్లాలో 378మంది పిల్లలను ఎంపిక చేసినట్లు సత్యసాయి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ పథకం ద్వారా అనాథ పిల్లలు, ఎచ్ఐవి ప్రభావిత పిల్లలు, పీఎం కేర్ పిల్లలు, కోవిడ్ సెమి అర్బన్ బాల బాలికలు ఇంటి వాతావరణంలో చక్కగా చదువుకోవడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ధర్మవరం పట్టణం 39వ వార్డుకు చెందిన దక్షిత(5) అనే చిన్నారి అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. దక్షిత కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బెంగళూరు వెళ్లి ఆసుపత్రిలో చికిత్స అందించినా కోలుకోలేదని జ్వరం ఎక్కువై బుధవారం మృతి చెందిందని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సత్య కుమార్ యాదవ్ సిబ్బంది వెళ్లి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు.
అనంతపురం జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో తాత్కాలిక టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు బాలుర పాఠశాలలో టీజీటీ హిందీ, ఇంగ్లీష్, పిఈటిలో కాళీ ఉందన్నారు. తిమ్మాపురం బాలికల పాఠశాలలో సైన్స్, గణితం ,జీవశాస్త్రం, కనేకల్ పాఠశాలలో గణితం, నల్లమాడ బాలికల పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ,హిందీ ,ఇంగ్లీష్, హిస్టరీ, పిఈటి పోస్టులకు అప్లై చేసుకోవాలన్నారు.
మూడేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన బాలునిపై పోక్సో కేసు నమోదైంది. అనంతపురం నగర శివారులోని ఓ కాలనీకి చెందిన భార్యాభర్తలు భవన నిర్మాణ పనికి తమతో పాటు చిన్నారిని తీసుకెళ్లారు. పనిలో నిమగ్నమై ఉండగా, చిన్నారి సమీపంలో కనిపించలేదు. పరిసర ప్రాంతంలో గాలించగా.. ఓ ఇంటి వద్ద మైనర్ బాలుడు బాలికతో అసభ్య ప్రవర్తన గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా..మంగళవారం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
ఆంధ్ర సరిహద్దుకు చేరుకున్న తుంగభద్ర జలాలను రైతులు ఘనంగా స్వాగతించారు. సోమవారం ఉదయం ఎగువ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆంధ్ర సరిహద్దులోని 105 కిలోమీటర్ల వద్దకు చేరుకున్నాయి. దీంతో హెచ్ఎల్సీ అధికారులు జలాలను స్వాగతిస్తూ పూజలు నిర్వహించారు. రైతులు తుంగభద్ర జలాలు ఆంధ్ర సరిహద్దుకు చేరుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు.
తుంగభద్ర జలాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు చేరుకున్నాయి. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండలం ఆంధ్ర సరిహద్దుకు 105వ కిలోమీటర్ వద్దకు తుంగభద్ర జలాలు చేరుకున్నాయి. తుంగభద్ర హై లెవెల్ కెనాల్లో తుంగభద్ర జలాలను చూసిన రైతులు ఎంతో సంతోషపడ్డారు. తుంగభద్ర జలాలు ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి చేరుకోవడం సంతోషదాయకంగా ఉందని అన్నారు.
ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్లో రైలు కిందపడి ఓ యువకుడి మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. హిందూపురం రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఇసుక పంపిణీపై సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా మైండ్స్ జియాలజీ అధికారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.