India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 19న కళాశాల 79వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.వసుంధర్ తెలిపారు. దీనికి సంబంధించి కళాశాలలో ఏర్పాటు చేసే సాంస్కృతిక, వికాసిక, క్రీడా కార్యక్రమాలలో ప్రతి విద్యార్థి, సిబ్బంది ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్లో 987 మార్కులు సాధించిన పామిడి యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో దూషించిన వారిపై కేసు నమోదైంది. ఈ నెల 13న సుధాకర్ చేసిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టనున్నారు.
బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జి జస్టిస్ జి.శ్రీనివాస్ను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ మంగళవారం సన్మానించారు. అనంతరం జడ్జికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. జిల్లా జడ్జిగా ఉత్తమ సేవలు అందించారని.. జిల్లా పోలీసుశాఖ, జిల్లా న్యాయశాఖలు పరస్పర సహకారంతో ముందుకెళ్లి బాధితులకు న్యాయం, నిందితులకు శిక్షలు పడటాన్ని గుర్తు చేసుకున్నారు.
పెళ్లికూతరు కావాల్సిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాప్తాడు మండలంలో జరిగింది. పూలకుంట గ్రామానికి చెందిన రేణుక(24) ఆకుతోటపల్లి-1 సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆమెకు కళ్యాణదుర్గానికి చెందిన యువకుడితో ఈ నెల 20న వివాహం జరగాల్సి ఉంది. ఇంట్లో సందడి మొదలవగా యువతికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకంలో రుణాలు, ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లా పరిషత్లో ఉన్న డీపీఆర్సీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల, రుణాలు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
విపత్తుల సమయంలో అగ్నిమాపక సేవలు అభినందనీయమని జిల్లా జడ్జి శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలోని అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. ఫైర్ సర్వీస్ సభ్యులు అగ్ని తీవ్రతను తగ్గించడంలో, కానీ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడడంలో మంచి నైపుణ్యత కనబరుస్తారని జడ్జి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్లు చోరీకి గురైన విషయం తెలిందే. ఈ ఘటనలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక్కడ పనిచేసిన మాజీ ఉద్యోగులను విచారిస్తున్నారు. పెనుకొండ సీఐ రాఘవన్ తన బృందంతో తమిళనాడుకు వెళ్లి పలువురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది. కాగా 2020 నుంచి ఈ చోరీలు జరుగుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.
సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని ధనాపురం వద్ద <<16083041>>ఘోర<<>> ప్రమాదానికి కారణమైన వాహనాన్ని SI నరేంద్ర బెంగళూరులో స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం ఆటోను ఐచర్ వాహనం ఢీకొనగా ముగ్గురు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐచర్ వాహన డ్రైవర్ పరారై బెంగళూరులో తలదాచుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ తమ సిబ్బందితో వెళ్లి వాహనాన్ని సీజ్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు అనంతపురంలోని మూడవ పట్టణ పోలీసులు రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్తో వాహనాలు వెళ్ళకూడదన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేయరాదన్నారు.
Sorry, no posts matched your criteria.