Anantapur

News August 18, 2025

ఎస్కేయూలో సీట్ల అలాట్‌మెంట్

image

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో యూనివర్సిటీ అధికారులు సోమవారం సీట్ల అలాట్‌మెంట్ ప్రక్రియ చేపట్టారు. ఇటీవల 2 కౌన్సెలింగ్‌లలో సీట్లు కేటాయించడంతో అలాట్మెంట్ ఆర్డర్‌తో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి సీట్ల అలాట్‌మెంట్‌కి హాజరయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర, సిబ్బంది ధ్రువ పత్రాలను పరిశీలించారు.

News August 18, 2025

యూరియా వినియోగంపై నిఘా ఉంచాలి: కలెక్టర్

image

యూరియా వినియోగంపై అధికారులు నిఘా ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆదేశించారు. జిల్లాకు ఈ ఏడాది ఖరీఫ్‌లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, మొత్తం 29,527 మెట్రిక్ టన్నుల యూరియా లభ్యత ఉందన్నారు. 26,008 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించగా, ఇంకా 3,519 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.

News August 18, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశముందని, అనంతపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు, రైతులు, కూలీలు టవర్లు, చెట్లు, బహిరంగ ప్రదేశాలలో ఉండవద్దన్నారు. సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని సూచించారు.

News August 18, 2025

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

PGRS అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
అనంతపురంలోని ఆయా శాఖల జిల్లా అధికారులు నాణ్యతగా అర్జీలను పరిష్కరించాలన్నారు. ఇందులో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలన్నారు.

News August 17, 2025

బేలోడులో బైక్ ఢీకొని బాలుడి మృతి

image

బైక్ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వీరాంజనేయులు కుమారుడు కార్తీక్ (5)రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ బైక్‌పై రంగచేడు గ్రామం నుంచి వస్తూ ప్రమాదవశాత్తు బాలుడిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

News August 16, 2025

గర్భిణి ఆత్మహత్య.. భర్త, అత్తమామల అరెస్ట్

image

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన శ్రావణి అనే గర్భిణి ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్తమామలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అత్తారింటి వేధింపులు భరించలేక ఈ నెల 14న పుట్టింటికి వెళ్లిన శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు కారణమైన భర్త శ్రీనివాసులు, మామ శివప్ప, భర్త కరియమ్మలను ఇన్‌ఛార్జి డీఎస్పీ శ్రీనివాసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జడ్జి రిమాండ్ విధించారు.

News August 16, 2025

యల్లనూరు యువకుడిపై పోక్సో కేసు

image

యల్లనూరు (మం) జంగంపల్లికి చెందిన నాగ మల్లేశ్ పై పోక్సో కేసు నమోదైంది. తాడిపత్రికి చెందిన బాలికను నమ్మించి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టి బాలికను కుటుంబీకులకు అప్పగించి, యువకుడిపై కేసు నమోదు చేశామన్నారు.

News August 16, 2025

‘విద్యార్థులారా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’

image

అనంతపురం JNTUలో బీటెక్ స్వీడన్ బ్యాచ్ కోర్స్‌లో CSE-3, ECE-7 సీట్లను స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తున్నట్లు వీసీ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ సుజాత తెలిపారు. వివరాలకు JNTUలోని డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు ఏడాదికి రూ.1,50,000 కోర్స్ ఫీజు ఉంటుందని తెలిపారు.

News August 15, 2025

జీరో ఫేర్‌ టికెట్‌.. అమ్మా జర్నీ ఫ్రీ!

image

అనంతపురం జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. బుక్కరాయసముద్రం ఆర్టీసీ బస్టాండ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని MP లక్ష్మీనారాయణ, MLA శ్రావణి ప్రారంభించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో.. ఆధార్‌, రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీలలో ఏదో ఒకటి చూపించి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. జిల్లాలో 402 బస్సులను ఫ్రీ జర్నీకి కేటాయించారు.

News August 14, 2025

SKU అకాడమిక్ డీన్‌గా ప్రొఫెసర్ కృష్ణకుమారి నియామకం

image

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అకాడమిక్ డీన్‌గా ప్రొఫెసర్ ఆలూరు కృష్ణకుమారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ యూనివర్సిటీ ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్ బి.అనిత, రిజిస్ట్రార్ రమేశ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈమె ఎస్కేయూ కళాశాల ప్రిన్సిపల్‌గా, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఈమె జియోగ్రఫీ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.