Anantapur

News April 18, 2025

పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పాటించాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో అన్ని పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పాటించాలని, ప్రమాదాలు జరుగకుండా తగిన చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మీటింగ్ & డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కమిటీ మీటింగ్‌లను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. పరిశ్రమలలో ప్రమాదకర రసాయనాలపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు.

News April 18, 2025

‘గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలి’

image

అనంతపురం కలెక్టరేట్‌లో రెవెన్యూ భవనంలో గురువారం సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల తెగల వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాల వారి గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

News April 17, 2025

ATP: డిస్ట్రిక్ మినరల్ ఫండ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం 

image

అనంతపురం కలెక్టరేట్‌లో గురువారం డిస్ట్రిక్ మినరల్ ఫండ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా మినరల్ ఫండ్ నిధుల వినియోగం, ప్రాజెక్టుల ఎంపిక ఇతర సంబంధిత అంశాల గురించి చర్చించుకున్నారు. కార్యక్రమంలో హిందూపురం MP పార్థసారథి, MLAలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, JC అస్మిత్ రెడ్డి, అమిలినేని సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

News April 17, 2025

అనంత– బెంగళూరు రైలుకు భారత రైల్వే శాఖ ఆమోదం

image

శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే బోర్డు 2025 ఏప్రిల్ 15 న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పలు సందర్భాల్లో ఈ విషయం పై ప్రస్తావించారు. అతి కేంద్ర రైల్వే మంత్రి ప్రారంభిస్తారని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

News April 17, 2025

అనంతపురంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ 

image

అనంతపురం కలెక్టరేట్‌లో గురువారం సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు, తెగల వర్గాల నుంచి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అర్జీలు స్వీకరించారు. అర్జీలను స్వీకరించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. ఎస్పీ జగదీష్, DRO ఏ.మలోల, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

News April 17, 2025

ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డల జననం

image

హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శిల్ప బుధవారం రాత్రి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాధారణ ప్రసవంలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారని డా.నీరజ తెలిపారు. శిశువుల బరువు తక్కువ ఉండటంతో అనంతపురం రెఫర్ చేశామన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

News April 17, 2025

ఈ సమ్మర్​లో ఎటు ప్లాన్ చేస్తున్నారు?

image

వేసవి సెలవుల్లో పిల్లలను పిల్లలను విహారయాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలో ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అవి.. పెన్నహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తికోట, పుట్టపర్తి, ఆలూరుకోన, కసాపురం, జంబు ద్విపా, యోగివేమన సమాధి, కదిరి నరసింహస్వామి, తాడిపత్రి చింతల వెంకటరమణ దేవాలయం.

News April 17, 2025

కియాలో ఇంజిన్ల చోరీ.. 8 మంది అరెస్ట్

image

పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్ల చోరీ కేసులో పురోగతి లభించింది. తమిళనాడుకు చెందిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కోర్టు రిమాండ్ విధించడంతో పెనుకొండ సబ్ జైలుకు తరలించారు. వారిని విచారించిన తర్వాత మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని వెనుక కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

News April 17, 2025

ధర్మవరం రూట్‌లో పనులు.. పలు రైళ్లు రద్దు

image

ధర్మవరం రైల్వే స్టేషన్‌లో పుట్టపుర్తి-తిరుపతి కనెక్షన్ పాయింట్స్, పాయింట్ ఛేంజింగ్ పనులు బుధవారం మొదలయ్యాయి. దీంతో గుంతకల్లు-తిరుపతి, తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజర్ రైళ్లు బుధవారం నుంచి మే 17వరకు రద్దయ్యాయి. ఈ మార్గంలో వెళ్లే మరిన్ని రైళ్లను గుత్తి మీదుగా రేణిగుంటకు మళ్లించారు. ఇక నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ కదిరి-నర్సాపూర్‌ మధ్య రాకపోకలు సాగించనుంది.

News April 17, 2025

ATP: గ్రామస్థాయిలో సమస్యలను పరిష్కరించాలి- కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సంక్లిష్టమైన అర్జీలను వదిలిపెట్టకుండా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం గుంతకల్లు రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామస్థాయిలో నాణ్యతగా సమస్యలను పరిష్కరించాలన్నారు. వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.