India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. సోమవారం మంత్రి మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్ల విద్యార్థుల డైట్ బిల్లుల కోసం బడ్జెట్లో కంటే అదనంగా రూ.45.52 కోట్లు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో డైట్ ఛార్జీలకు రూ.135 కోట్లు చెల్లించారని, ఇప్పుడు అదనంగా రూ.45.52 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
హీరో అల్లు అర్జున్పై ఏసీపీ విష్ణుమూర్తి చేసిన వ్యాఖ్యలను BJP నేత విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. ‘వీధి రౌడీ భాషలో ఒక పోలీస్ అధికారి మీడియా ముందు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం తప్పు కాదా? విష్ణుమూర్తి ఇలా మాట్లాడేందుకు తెలంగాణ డీజీపీ అనుమతి ఇచ్చారా? తెలంగాణలో అల్లు అర్జున్కు ఆధార్ కార్డుందా అని ప్రశ్నించడానికి అతనెవరు?’ అని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు.
బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఎరుకల శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అర్ధరాత్రి పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. కార్యకర్తను విడుదల చేయించారు. కాగా జనసేన నాయకుల ఒత్తిడితోనే టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్బంది పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు.
పుట్టపర్తి గ్రామీణ ప్రాంతాలలోని నిర్మానుష్య ప్రదేశాలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. ఆదివారం సాయంత్రం అటవీ ప్రాంతాలైన అమకొండపాళ్యం, వెంగళమ్మ చెరువు పరిసర ప్రాంతాలతో పోలీసులు ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం తాగటం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ జరగకుండా పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ పెట్టారు.
ప్రజా సమస్యలపై రేపు (సోమవారం) అర్జీలు స్వీకరిస్తామని అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ వెల్లడించారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసెల్ సిస్టం-పీజీఆర్ఎస్) కార్యక్రమం ఉంటునాదన్నారు. కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇవ్వాలని కోరారు.
అనంతపురం వైసీపీ జిల్లా బూత్ కమిటీల విభాగం అధ్యక్షుడిగా వై.అమర్నాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికు రుణపడి ఉంటానని తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని కదిరి బీసీ వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న జగదీశ్ నాయక్ అదృశ్యం కావడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థిని వెతికి పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. తనకల్లు మండలం రత్నా నాయక్ తండాకు చెందిన జగశ్ష్ నాయక్ శనివారం ఉదయం అదృశ్యమైనట్టు తోటి విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థుల కదిలికపై కన్నేసి ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
రాయదుర్గంలో జాతి వైర్యాన్ని సైతం మరిచి ఓ వరాహం శునకం పిల్లలకు పాలు ఇచ్చి అమ్మతనాన్ని చాటుకుంది. కోటలో శంకరమఠం ఆలయం సమీపాన ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రజలు ఈ ఘటన చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేసిందని స్థానికులు తెలిపారు.
రౌడీషీటర్లు, చెడునడత కల్గిన వారిపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశించారు. కసాపురం పోలీస్ స్టేషన్లో శనివారం ఆయన వార్షిక తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్ను, లాకప్ గదులను, కంప్యూటర్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల సీడీ ఫైల్స్ను పరిశీలించి, ఆయా కేసుల పురోగతిని తెలుసుకుని తగు సూచనలు చేశారు.
అనంతపురం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. 2 నెలల వ్యవధిలో మూడు ఘోర ప్రమాదాలు జరగ్గా 18 మంది మృతి చెందారు. అక్టోబర్ 26న శింగనమల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టిన దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నవంబరు 23న గార్లదిన్నె మం. తలగాసుపల్లె వద్ద ఆటోను RTC బస్సు ఢీకొనడంతో 8 మంది మృతి దుర్మరణం చెందారు. నేడు మడకశిర మండలంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
Sorry, no posts matched your criteria.