India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన ఆదికేశవులు హత్యకేసులో నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. ఎవరినీ వదలకుండా దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిందితులకు శిక్షలు పడేలా తగిన ఆధారాలు సేకరించాలని సూచించారు. ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ఠ నిఘా వేయాలన్నారు. మెచ్చిరి నుండి కర్నాటకలోని నాగసముద్రానికి వెళ్లే రహదారిపై ఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు.
అనంతపురం జిల్లాలో ఇవాళ సాయంత్రం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఒకపక్క ఎండ, మరోపక్క మేఘావృతమై విభిన్న వాతావరణం కనిపించింది. బుక్కరాయసముద్రం కొండపై పూర్తిగా మేఘాలు కమ్ముకున్నాయి. నగరంలో కొన్ని రోజులుగా మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్నాయి. అనంతపురం రూరల్ పరిధిలో పలువురు రైతులు వేరుశనగ, ఆముదం, కంది పంట విత్తనం వేయడానికి సిద్ధమయ్యారు.
కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లిలో మమత(24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మమత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి భర్త శాంతి కుమార్, ఒక కూతురు ఉన్నారు.
గూగూడు అనే ప్రాంతంలో గుహుడు అనే మహర్షి శ్రీరాముడి రాక కోసం ఆశ్రమం ఏర్పాటుచేసుకుని తపస్సు చేశాడని అని ప్రతీక. పితృవాక్య పరిపాలన కోసం శ్రీరాముడు అరణ్యవాసానికి వెళుతున్న సమయంలో గుహుని ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించారని పురాణాలు చెబుతున్నాయి. తిరిగి వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరుగు పయనంలో వస్తానని మాట ఇచ్చారని తెలిపారు. నాటి గుహుని ఆశ్రమమే కాలక్రమేణా గూగుడుగా మారిందని ప్రతీతి.
కుందుర్పిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న భద్ర కుంటలో ప్రమాదవశాత్తు పడి ఆరో తరగతి విద్యార్థి విష్ణువర్ధన్, నవీన్ అనే యువకుడు మృతి చెందారు. విష్ణువర్ధన్ కాల కృత్యాలు తీర్చుకుంటూ ప్రమాదవశాత్తు కుంటలో పడ్డాడు. గమనించిన నవీన్ అనే యువకుడు విష్ణువర్ధన్ను కాపాడడానికి కుంటలోకి దిగాడు. ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లాలో రానున్న 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశమున్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామిలు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి పగటి ఉష్ణోగ్రతలు 35.1-36.6 మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 25.2-25.9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చునన్నారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటమిపై కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తమ అంచనాలకు అతీతంగా జరిగాయన్నారు. తన మిత్రుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రోజూ ప్రజల్లో ఉన్నా ఓడిపోయారన్నారు. అందువల్ల ఎమ్మెల్యేలు జనాల్లో లేకపోవడంవల్ల ఓడిపోయారని చెప్పడానికి కూడా లేదన్నారు. జగన్ చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టి ఆయనవైపే ఓటర్లు ఉంటారని భావించామని పేర్కొన్నారు.
కదిరి మాజీ ఎమ్యెల్యే పి.వి సిద్ధారెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆరోపణలు ఉండటంతో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇవాళ ఉద్యోగం మేళా నిర్వహిస్తున్నట్లు కల్పనాధికారి కళ్యాణి తెలిపారు. ఎమ్మెస్ నవభారత్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉద్యోగ మేళాకు పదో తరగతి నుంచి డిగ్రీ చదివి, 18-25 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థులు కుల ధ్రువీకరణపత్రంతో హాజరు కావాలన్నారు.
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇన్స్పైర్ అవార్డులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి జిల్లాలోని ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6-10 తరగతుల విద్యార్థుల నుంచి నాణ్యమైన నమూనాలను ఉపాధ్యాయులు సిద్ధం చేయించి ఇన్స్పైర్ మనక్ www.inspireawards-dst.gov.in వెబ్సైట్లో సెప్టెంబరు 15లోగా నమోదు చేసేలా చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.