India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను సోమవారం DBLNS కంపెనీ ప్రతినిధులు సందర్శించారు. అనంతరం విద్యార్థులకు ఉపయోగపడే లైవ్ ప్రాజెక్టులు, వర్క్ షాప్లు, తదితర అంశాలపై MOU కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ శంకర్, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, యూనివర్సిటీ డైరెక్టర్ సుజాత, ఈశ్వర్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్, CSE విభాగాధిపతి భారతి, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలానికి చెందిన 104ఏళ్ల బండయ్య మాస్టారుకు స్థానిక పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేసిన బండయ్య 104ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటం గొప్ప విషయమని అన్నారు. అనంతరం సబ్ ట్రెజరీ కార్యాలయంలో సర్టిఫికేట్ ప్రదానం చేశారు.

ఏ ఒక్క అర్జీదారుడు నిర్లక్ష్యానికి గురికాకుండా, ప్రతి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజలకు తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్ శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన PHRS కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

ఆ కుటుంబమంతా సంతోషంగా గడిపి కొద్ది క్షణాలలో ఇంటికి చేరుకుంటాం అనుకున్న సమయంలో మృత్యువు చిన్నారి రిత్విక్(3)ను కబళించింది. దిమ్మగుడి గ్రామానికి చెందిన సురేంద్ర రెడ్డి భార్య, కుమారులతో కలిసి పెద్దపప్పూరు అశ్వర్థం బ్రహ్మోత్సవాలకు వెళ్లి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చిన్నారి రిత్విక్ మృతి చెందాడు. దేవుడా పిల్లవాడి మీద అయినా దయ చూపలేకపోయావా అంటూ కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.

రాయదుర్గం పట్టణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని బళ్లారి రోడ్డు సీతారామాంజనేయ కళ్యాణమండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్వామా హాలు నుంచి సీతారామాంజనేయ కళ్యాణ మంటపానికి మార్చినట్లు కలెక్టర్ అధికార వర్గాలు తెలిపాయి. ప్రజలు ఈ స్థల మార్పును గమనించాలని కోరారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

గుత్తి ఆర్ఎస్లో చెత్త పడేసే విషయంలో ఇరువర్గాల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటిముందు చెత్త పడేశారని వంశీ, అతని తల్లి సాయమ్మపై రిజ్వానా, రసూల్ కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీ, సాయమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

అనంతపురంలోని JNTU-OTPRIలో శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇన్ఛార్జ్ వీసీ సుదర్శన రావు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసం కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

గుత్తి మండలం చెర్లోపల్లి సేవాఘడ్లోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ను శనివారం అనంత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం కలెక్టర్కు ఆలయ కమిటీ సభ్యులు డోలు, కత్తిని అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలను లోకల్ ఫెస్టివల్గా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

అనంతపురం JNTUలోని మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు కళ్యాణి రాధ, ఓం ప్రకాశ్ను శనివారం ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. NIT-Rలో ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వారు ప్రదర్శించిన టెక్నికల్ పేపర్ మీద వారికి NIT-R నుంచి సర్టిఫికెట్, అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చెన్నారెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజులలో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.

ఫిబ్రవరి 17న రాయదుర్గం పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు ఏపిడి డ్వామా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.