Anantapur

News July 10, 2024

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సత్యసాయి ఎస్పీ

image

ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న కొత్త రకాలైన సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ట్రేడింగ్ మోసాలు, హాని ట్రాప్, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తయారుచేసిన పోస్టర్లను విడుదల చేశారు. తక్కువ సమయంలో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశను ఎంచుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

News July 9, 2024

ఎన్నాళ్లీ.. చెట్ల కింద పాఠాలు

image

ఉరవకొండ పట్టణం శివరామిరెడ్డి కాలనీలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలకు నేటికీ సొంత భవనం లేదు. ఏడాదిన్నర నుంచి పాఠశాలను స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాల నడుస్తున్న డీఆర్‌డీఏ భవనాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. పాఠాలు చెట్ల కింద చెబుతుండగా.. ప్రాంగణం ప్రహరీకి నల్లరంగులు వేసి బోర్డులుగా మార్చి బోధన సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రస్తుతం 1 నుంచి 4వ తరగతి వరకు 93 మంది విద్యార్థులు ఉన్నారు.

News July 9, 2024

గుంతకల్లులో మరికొందరిపై కేసులు

image

గుత్తేదారుల నుంచి రైల్వే అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై గుంతకల్లులో CBI విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ, బెంగళూరుకు చెందిన అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు గుత్తేదారులను అరెస్టు చేయగా మరికొందరిపై కేసులను నమోదు చేశారు. ఏయే పనులకు లంచాలు ఇచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రసుత్తం DRM అరెస్టు కావడంతో ADRM సుధాకర్‌ ఇన్‌ఛార్జి డీఆర్‌ఎంగా కొనసాగుతున్నారు.

News July 9, 2024

నేడు ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ సమావేశం

image

ఉమ్మడి అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జడ్పీ సమావేశం జరగనంది. ఈ మేరకు జిల్లా పరిషత్ సీఈఓ వైఖోమ్‌ నిదియాదేవి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు, జడ్పీటీసీలు హాజరుకావాలని కోరారు.

News July 9, 2024

ATP: భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకుని

image

బత్తలపల్లి మండలం తంభాపురంలోని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మన్న (80) భార్య లక్షమ్మ పింఛన్ డబ్బులు ఇవ్వలేదని ఈనెల 6న రోకలి బండతో కొట్టారు. దీంతో ఆమె మృతి చెందింది. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన ఆయన నిందితుడిగా ముద్ర పడిందని మనస్తాపం చెందారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మండలంలోని చిన్నేకుంటపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 9, 2024

టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నాయకుడిపై కేసు

image

అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని 43 ఉడేగోళం గ్రామ వైసీపీ నాయకుడు రామాంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 1న పింఛన్ల పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, గ్రామ టీడీపీ నాయకులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రామాంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

News July 9, 2024

పేదల సొంతింటి కల సహకారం: మంత్రి పయ్యావుల కేశవ్

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన ఉచిత ఇసుక విధానంతో పేదల సొంతింటి కల సహకారం కానుందని ఉరవకొండ ఎమ్మెల్యే, మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ధరలు పెంచి పేదలను ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీ మేరకు సీఎం ఉచిత ఇసుక పాలసీని అమలు చేశారని మంత్రి వెల్లడించారు

News July 9, 2024

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించండి: ఎస్పీ మాధవరెడ్డి

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారి నుంచి 35 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి పరిష్కరించాలని ఆదేశించారు.

News July 8, 2024

వైఎస్ జగన్‌‌ని కలిసిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కలిశారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వైసీపీ నాయకులతో కలిసి వైఎస్సార్‌కు నివాళులర్పించారు. ఈ క్రమంలో వైఎస్ భారతితో ఉష శ్రీ చరణ్ కాసేపు ముచ్చటించారు.

News July 8, 2024

అనంత: కక్కలపల్లి మార్కెట్‌లో తగ్గిన టమాటా ధర

image

కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు తగ్గాయి. గత నాలుగైదు రోజులు కిలో గరిష్ఠ ధర రూ.35 పైన పలుకుతూ వచ్చాయి. ఆ ధర ఆదివారం రూ.30కి పడిపోయింది. కిలో సరాసరి ధర రూ.23, కనిష్ఠ ధర రూ.18తో పలికినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మొత్తంగా మార్కెట్లోని మండీలకు 60 టన్నుల టమాటా వచ్చాయన్నారు.