India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూడేరు మండల పరిధిలోని పెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) డ్యాంలో నీటిమట్టం పడిపోయిందని అధికారులు తెలిపారు. ఆదివారం నాటికి డ్యామ్లో 0.588 టీఎంసీల నీరు ఉన్నట్లు డ్యాం అధికారులు వెల్లడించారు. జలాశయం వద్ద ఏర్పాటైన శ్రీరామారెడ్డి, సత్యసాయి, అనంతపురం, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు రోజు సుమారు 60 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న లక్ష్మీనారయణ విధులు ముగించుకుని బైక్లో వెళుతుండగా బత్తలపల్లి మండలం ముష్టూర్ వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది.
శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు.
రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన డి.హీరేహల్ మండలంలో ఆదివారం జరిగినట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. బళ్లారికి చెందిన ఇద్దరు యువకులు స్కూటీపై వేగంగా వెళుతూ ఓబుళాపురం వద్ద అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో మహబూబ్ బాషా(21) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బళ్లారికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన ఇంటిపై టీడీపీ నాయకులు రాళ్లు రువ్వి, కారు ధ్వంసం చేశారని కొత్తకోట సర్పంచ్, వైసీపీ నేత నాగమణి ఆరోపించారు. ఈ ఘటనలో తన ఇంట్లో ఉన్న కేశవ్, చెన్నమ్మకు గాయాలయ్యాయని తెలిపారు. రాజకీయ కక్షతోనే దాడి చేశారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
పింఛన్ డబ్బులు అడిగితే ఇవ్వలేదని భార్యను భర్త రోకలిబండతో కొట్టి చంపాడు. బత్తలపల్లి మండలం తంబాపురంలోని YSR కాలనీకి చెందిన లక్ష్మమ్మ భర్త లక్ష్మన్న రాత్రి ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యను పింఛన్ డబ్బులు అడిగితే ఇవ్వలేదు. ఆగ్రహానికి లోనైన లక్ష్మన్న రోకలి బండతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కుమారుడు ముత్యాలప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
ఇసుక పూర్తిగా ఉచితమే. కానీ.. లోడింగ్, రాయల్టీ కింద మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.195 నిర్ణయించారు. లబ్ధిదారునికి రోజుకు 20 మెట్రిక్ టన్నులు మాత్రమే అందిస్తారు. ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, డెలివరీ చిరునామా తప్పనిసరిగా అందించాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పంపిణీ చేస్తారు. అయితే డిపో నుంచి డెలివరీ చేయడానికి రవాణా ఛార్జీ కింద ఎంత వసూలు చేయాలనే దానిపై ఆదివారం వెల్లడించే అవకాశం ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లాలోని 18 సంవత్సరాలలోపు ఉన్న బాల బాలికలు పురస్కారాల ఎంపికకు దరఖాస్తులు చేసుకోవాలని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. 2025 సంవత్సరానికి సంబంధించి బాలల పురస్కారాలకు అర్హులైన బాల బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. క్రీడలు, సామాజిక రంగం, ధైర్య సాహసాలు, నూతన ఆవిష్కరణ, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాలపై ఈనెల 31లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
సత్యసాయి జిల్లాలో కలెక్టర్గా పని చెయ్యడం మరుపురాని ఘట్టమని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. బదిలీ అయిన సందర్భంగా పుట్టపర్తిలో అధికారులు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అన్ని శాఖల సహకారంతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. భవిష్యత్లో కూడా అందరూ ఇలానే పని చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం అమలులో భాగంగా ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక పంపిణీ చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానం అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.