India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

PGRS పిటిషన్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవెన్యూ సెక్టర్, రీసర్వే, తదితర అంశాలపై ఆర్డీఓలు, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, తదితరులతో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

అక్కాచెల్లెళ్లతో పెళ్లికి సిద్ధమైన యువకుడికి అధికారులు షాక్ ఇచ్చారు. గోరంట్ల మండలంలోని గుమ్మయ్యగారి పల్లికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకు సంబంధించిన పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇద్దరు యువతులు మైనర్లు కావడంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు పెళ్లిని నిలుపుదల చేశారు. యువకుడి కుటుంబ సభ్యులకు స్టేషన్లో సీఐ శేఖర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.

అనంతపురం JNTU నిర్వహిస్తున్న APECET-2025 పరీక్షకు అపరాధ రుసుము లేకుండా 33,454 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు APECET ఛైర్మన్ హెచ్.సుదర్శన రావు, కన్వీనర్ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి రూ.1,000 అపరాధ రుసుముతో ఈనెల 12 వరకు.. రూ.2,000 అపరాధ రుసుముతో ఈ నెల 17 వరకు.. రూ.4,000 అపరాధ రుసుముతో ఈనెల 24 వరకు.. రూ.10,000 అపరాధ రుసుముతో ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.

క్షేత్రస్థాయిలో రెవెన్యూ సదస్సులలో ఇచ్చిన (పీజీఆర్ఎస్) అర్జీని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం ఆత్మకూరు మండల కేంద్రం పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీని జిల్లా కలెక్టర్ పరిశీలించి, అర్జీదారుల పిటిషన్పై సమగ్రంగా పరిశీలన చేశారు. ఆత్మకూరు మండల కేంద్రం పరిధిలోని హరిజన లక్ష్మమ్మ అనే అర్జీదారులు ప్రజా సమస్యను పరిశీలించారు.

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి నుంచి రోడ్డు మార్గాన బెంగళూరుకు బయలుదేరారు. ఇవాళ ఉదయం పాపిరెడ్డిపల్లెకు చేరుకోగా వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో హెలికాప్టర్ ఫ్రంట్ గ్లాస్ పగిలిపోయి సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. దీంతో రోడ్డు మార్గంలో బెంగళూరుకు బయలుదేరారు.

ఒక చావును రాజకీయం చేయడానికే మాజీ సీఎం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ఆ గ్రామంలో ఏం జరిగిందో జగన్కు తెలియదని, ప్రకాశ్ రెడ్డి చెప్పిన మాటలు విని వస్తున్నారని అన్నారు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలని హితవుపలికారు. ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని, టీడీపీ నేతలు సంయమనం కోల్పోవద్దని సూచించారు.

ఒక చావును రాజకీయం చేయడానికే మాజీ సీఎం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ఆ గ్రామంలో ఏం జరిగిందో జగన్కు తెలియదని, ప్రకాశ్ రెడ్డి చెప్పిన మాటలు విని వస్తున్నారని అన్నారు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలని హితవుపలికారు. ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని, టీడీపీ నేతలు సంయమనం కోల్పోవద్దని సూచించారు.

విడపనకల్లో మంగళవారం ప్రజా సమస్యల పరిష్కారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

బంధువుల అమ్మాయితో తాను ఎయిర్పోర్టులో మాట్లాడుతున్న వీడియోను వైరల్ చేస్తూ టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘రేపు జగన్ పాపిరెడ్డిపల్లెకు వస్తున్నారు. ఆ పర్యటనను అడ్డుకునే పరిస్థితి కనపడకపోవడంతో నా బంధువులు, కుటుంబసభ్యులను నీచపు రాజకీయ క్రీడలోకి లాగుతున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని ట్వీట్ చేశారు.

రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 8వ తేదీన పరామర్శించనున్నారు. ఉదయం 10.00 గంటలకు రామగిరి మండలం కుంటిమద్ది వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్కు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో మంగళవారం హెలిప్యాడ్ వద్ద భద్రత సిబ్బంది పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.