Anantapur

News July 5, 2024

బ్రహ్మోత్సవాలకు రండి.. మంత్రి సవితకు శ్రావణి ఆహ్వానం

image

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కలిశారు. పెనుకొండలో కలిసిన ఆమె గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బీసీ వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని కోరారు. ఈ మేరకు పలు అంశాలపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు.

News July 5, 2024

అనంతపురం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

image

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో దారుణ హత్య జరిగింది. నల్ల దాసరి పల్లి గ్రామంలో బోయ ఆవుల లక్ష్మన్న (48) అనే వ్యక్తి ఇవాళ తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వర్ష సూచన

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుజరాత్-కర్ణాటక తీరాల వెంబడి విస్తరించిన ద్రోణి కారణంగా నేడు అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News July 5, 2024

కదిరిలో వైసీపీ కార్యకర్తలపై కేసు

image

కదిరిలో నడిరోడ్డుపై బాహాబాహీకి దిగిన వైసీపీలోని ఇరువర్గాల కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన వద్ద అప్పుగా తీసుకున్న రూ.5 లక్షలు తిరిగివ్వాలని అడిగినందుకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అంజాద్, ఖాజా తనను అపహరించి చంపేందుకు యత్నించారని సూర్యశేఖర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బలవంతంగా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా తన మిత్రులు కాపాడారని తెలిపాడు. ఈ ఘటనలో ఇరువర్గాలపై కేసు నమోదైంది.

News July 5, 2024

9న ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ సమావేశం

image

ఉమ్మడి అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 9వ తేదీన ఉదయం 10.30 గంటలకు జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లా పరిషత్ సీఈఓ వైఖోమ్‌ నిదియాదేవి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు, జడ్పీటీసీలు హాజరుకావాలని కోరారు.

News July 5, 2024

అనంతపురంలో 6న జాబ్ మేళా

image

ఉమ్మడి అనంతపురం జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ నెల 6న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కళ్యాణి తెలిపారు. ఓ కంపెనీలో క్రెడిట్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొంది 18-27 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు కోర్టు రోడ్డు సమీపంలో ఉన్న ఉపాధి కల్పన కార్యాలయానికి ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

News July 4, 2024

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు పర్సనల్ సెక్రటరీగా మధుసూదన్

image

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఓఎస్‌డీ/ పర్సనల్ సెక్రటరీగా ధర్మవరం మాజీ ఆర్డీవో మధుసూదన్‌ నియమితులయ్యారు. కరోనా సమయంలో ధర్మవరంలో విశిష్ట సేవలు అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కలిసి ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు.

News July 4, 2024

మాజీ సీఎం జగన్‌పై మండిపడ్డ మడకశిర ఎమ్మెల్యే

image

అనంతపురం నగరంలోని R&B లో మడకశిర టీడీపీ ఎమ్మెల్యే MS.రాజు గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రిమినల్స్‌ను మంచి వాళ్లని చెప్పడం జగన్‌కు మాత్రమే సాధ్యపడిందని అన్నారు. జగన్‌కు వచ్చిన మానసిక రోగానికి సరైన మందులు వాడాలని ఎద్దేవా చేశారు.

News July 4, 2024

పెనుకొండ: ఒకే కాన్పులో ముగ్గురు జననం.. తల్లి మృతి

image

పెనుకొండ మండలం మోటువారిపల్లికి చెందిన వెన్నెల(25) ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చి.. మృతి చెందారు. వెన్నెల జూన్ 29న ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లలు క్షేమంగా ఉన్నారు. అయితే వెన్నెల బిడ్డలకు జన్మనిచ్చి కోమాలోకి వెళ్లిపోయింది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

News July 4, 2024

టీడీపీ నాయకుల దాడిలో గాయపడి వైసీపీ నాయకుడి మృతి

image

హిందూపురం రూరల్ గొల్లాపురంలో టీడీపీ నాయకులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ కార్యకర్త సతీశ్(45) బెంగళూరులో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజకీయ కక్షతో కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సతీశ్‌పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మృతిచెందినట్లు వాపోయారు.