Anantapur

News July 4, 2024

జేఎన్టీయూ పరిధిలో 8 ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కోత

image

జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ పరిధిలో 8 ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యత ప్రమాణాలు సరిగా లేవని అధికారులు సీట్ల కోత విధించారు. అనంత జిల్లాలో రెండు, చిత్తూరులో ఒకటి, నెల్లూరులో రెండు, కడపలో 1, అన్నమయ్య జిల్లాలో రెండు ఇంజనీరింగ్ కళాశాల ఉన్నట్లు తెలిపారు. నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించారు. మొత్తం మీద 66 ఇంజనీరింగ్ కళాశాలలకు జేఎన్టీయూ అనుమతి ఇచ్చింది.

News July 4, 2024

ఉత్తమ అవార్డు కోసం దరఖాస్తులు చేసుకోండి: డీఈఓ

image

పుట్టపర్తిలో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ అవార్డుకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా అర్హులేనన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 15వ తేదీలోపు https:/nationalawardstoteachers. education.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు పంపాలని సూచించారు.

News July 4, 2024

అనంత ఉమ్మడి జిల్లాలో ముగిసిన కౌన్సిలింగ్

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు రెండు రోజుల పాటు నిర్వహించిన కౌన్సిలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. నార్పల బీసీ గురుకుల పాఠశాలలో తొలిరోజు బాలురకు, రెండోరోజు బాలికలకు మెరిట్ జాబితా మేరకు కౌన్సిలింగ్ చేపట్టారు. ఆయా తరగతుల్లో మొత్తం 63 సీట్లకు గాను 1.2 నిష్పత్తిలో 126 మందిని కౌన్సిలింగ్‌కు పిలిచారు.

News July 4, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి

image

తాడిపత్రి మండల పరిధిలోని ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలంలోనే జాకీర్ మృతి చెందగా, అక్బర్‌కు త్రీవంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించగా.. ఆస్పత్రిలో మృతిచెందినట్లు వెల్లడించారు. ఇద్దరూ అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 4, 2024

అనంత: బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు అరెస్ట్

image

పుట్లూరు మండలంలో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పుట్లూరు ఎస్సై హేమాద్రి తెలిపారు. నిందితులు రవితేజ, నాగేంద్రను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని ఈనెల 16వ తేదీ వరకు రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 4, 2024

అనంత: నేడు విద్యాసంస్థల బంద్.. పోలీసుల అప్రమత్తం

image

విద్యార్థి సంఘాలు నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అనంత జిల్లా పోలీస్ పోలీసు శాఖ అప్రమత్తమైంది. కేంద్రం నిర్వహించే పలు పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, ఇతరత్రా డిమాండ్లతో SFI, AISF, PDSEU, AISA, NSUI, PDSU సంఘాలు ఉమ్మడిగా బంద్ చేపట్టనున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

News July 4, 2024

అనంత: JNTUలో పరీక్షలు వాయిదా

image

అనంతపురం జిల్లా కేంద్రంలోని JNTU పరిధిలో సెమిస్టర్ పరీక్షలు 4న జరగాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య కేశవరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న బంద్ సందర్భంగా పరీక్షలు వాయిదా వేశామన్నారు. తదుపరి పరీక్షల నిర్వహణ తేదీలను యూనివర్సిటీ వెబ్ సైట్‌లో అప్‌డేట్ చేసినట్లు తెలిపారు.

News July 4, 2024

వాల్మీకి మహర్షి పీఠాధిపతిని కలిసిన ఎంపీ అంబికా

image

ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు, ఉజ్జయిని వాల్మీకి మహర్షి పీఠాధిపతి బాలయోగి ఉమేశ్ నాథ్ గురూజీని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్మి నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాల్మీకుల ఎస్టీ అంశం గురించి చర్చించారు. సమస్య పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

News July 3, 2024

గూగూడు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆగ్రహం

image

శ్రీ గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో జాప్యం చేస్తున్న అధికారులపై ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడ్రోజుల క్రితం సమావేశం నిర్వహించి ఆదేశాలిచ్చినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడు పూర్తి చేస్తారంటూ మండిపడ్డారు. మరో నాలుగు రోజుల్లో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని.. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

News July 3, 2024

అనంతపురం జిల్లాకు వర్ష సూచన

image

జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుజరాత్-కేరళ తీరాల వెంబడి ద్రోణి విస్తరించడంతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.