India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు, దాడులు,ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వివరాలను ఎస్పీ పి.జగదీష్ శుక్రవారం వెల్లడించారు. పేకాట, మట్కా, తదితర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎం.వి కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై మోటారు వాహనాల చట్ట ప్రకారంగా 707 కేసులు నమోదు చేశారు. రూ. 1,72,816/- లు ఫైన్స్ వేశారు.
అనంతపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ రాయదుర్గం MLA కాల్వ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు అని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు రైతాంగానికి, సాగునీటి రంగానికి ఏమీ చేయకుండా తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.
పెనుకొండ బాబయ్య స్వామి 752వ గంధం, ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగా బాబా ఫకృద్దీన్ జన్మస్థలం ఇరాన్ దేశం. చక్రవర్తిగా రాజ్యపాలన చేస్తున్న సమయంలో చేసిన తప్పునకు పశ్చాత్తాపంతో గురువుల ఆదేశానుసారం ఇరాన్ను వీడుతారు. దేశాలన్నీ తిరుగుతూ తమిళనాడులోని తిరుచనాపల్లికి చేరతారు. అక్కడ సత్తేహార్ తబ్రే ఆలం బాద్షాను గురువుగా పొందుతారు. ఆయన వేపపుల్ల ఇచ్చి పెనుకొండకు వెళ్లమని బాబాను ఆదేశిస్తారట. <<14864905>>Cont’d..<<>>
అలా <<14864840>>బాబా<<>> ఫకృద్దీన్ పెనుకొండ శివారులోని ఓ మంటపంలోకి చేరుకుంటారు. ప్రజలకు ప్రేమను పంచుతూ మతసామరస్యాన్ని వివరించేవారు. బాబయ్య స్వామిగా పేరొంది ప్రజలను ఆశీర్వదించేవారు. అయితే గురువు ఇచ్చిన వేపపుల్లను రోజూ తలకింద పెట్టుకుని నిద్రపోయేవారట. ఒక రోజు ఆ వేపపుల్ల చిగురించడంతో ఇదే తన నివాసమని భావిస్తారు. క్రీస్తుశకం 694లో పరమదించడంతో అక్కడే సమాధి చేశారు. అప్పటి నుంచి ఏటా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
కుటుంబ కలహాలు తల్లీ, కొడుకు ప్రాణాలు తీశాయి. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గార్లదిన్నె మండలంలో జరిగింది. ఎర్రగుంట్లకు చెందిన సురేశ్, సుజాత(38) దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలున్నాయి. అవి తారాస్థాయికి చేరుకోవడంతో నిన్న ఉదయం ఆమె విష గుళికలు తీసుకున్నారు. నిద్రపోతున్న తన కుమారుడు చైతన్య, కుమార్తె రహిత్యకు వాటిని తినిపించారు. ఈ ఘటనలో తల్లీ, కుమారుడు మరణించారు. రహిత్య పరిస్థితి విషమంగా ఉంది.
అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో 2025 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్కు చెందిన 150 మంది విద్యార్థులు కళాశాల ప్రాంగణ నియామకాలలో ఉద్యోగాలు సాధించినట్లు ఇన్ఛార్జ్ వీసీ సుదర్శన రావు పేర్కొన్నారు. ఇందులో 121 మంది TCSలో, 11 మంది L&Tలో, 9 మంది CTSలో, 6 మంది FACTSETలో, 3 మంది MOSCHIPలో ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఇన్ఛార్జ్ వీసీ సుదర్శన రావు, కళాశాల ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు.
తనకల్లు మండలంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో గురువారం 10.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి తెలిపారు. నల్లచెరువు మండలంలో 6.2 మి.మీ, గాండ్లపెంట 5.8 మి.మీ, తలుపుల 4.4 మి.మీ, నల్లమడ, కదిరి, చిలమత్తూరు 4.2 మి.మీ, పెనుకొండ 4.0 మి.మీ, నంబులపూలకుంట మండలంలో 3.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన జవాన్ సుబ్బయ్య (45)కు నార్పలలో అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. పోలీసులు, బంధువులు, ప్రజల అశ్రునయనాల మధ్య వారి సొంత వ్యవసాయ పొలంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సైనిక అధికారులు గౌరవ వందనం సమర్పించి జాతీయ జెండాను జవాన్ సతీమణికి అందించారు. కన్నీటిని దిగమింగుతూ సుబ్బయ్య భార్య, కుమారుడు, కుమార్తె భౌతికకాయానికి సెల్యూట్ చేశారు.
జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) భౌతికకాయానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాళి అర్పించారు. భౌతికకాయాన్ని అధికారులు నిన్న రాత్రి నార్పలకు తీసుకురాగా ఆమె సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇవాళ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.
గోరంట్ల మండలం ముద్దులకుంట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి 2021లో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా సీఐ జయనాయక్ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. కోర్టు సుదీర్ఘ విచారణ చేసి నేరం రుజువు కావడంతో ముద్దాయికి మూడేళ్లు జైలు శిక్ష, 2 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ బోయ శేఖర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.