Anantapur

News August 14, 2025

రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించండి: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని అనంతపురం ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహశీల్దార్లు, రీసర్వే డీటీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారంలో RDO, MRO, డిప్యూటీ MRO బాధ్యతగా పనిచేసి, కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

News August 13, 2025

వచ్చే 2 రోజుల పాటు వర్ష సూచన

image

అధిక వర్షాల కారణంగా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందదని అన్నారు. వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పంట పొలాలపై శ్రద్ధ వహించి అప్రమత్తంగా ఉండాలన్నారు. చీడపీడలు సంభవిస్తే సంబంధిత అధికారులు లేదా శాస్త్రవేత్తలను సంప్రదించాలన్నారు.

News August 12, 2025

అదృశ్యమైన బాలుడు సూసైడ్

image

మూడు రోజుల క్రితం <<17361238>>అదృశ్యమైన<<>> గుమ్మగట్ట మండలం శిరిగేదొడ్డికి చెందిన కైలాస్ అనే 17 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం సమీపంలో విప్రమలై లక్ష్మీనరసింహస్వామి కొండకు శనివారం వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆలయం సమీప కొండలో మంగళవారం ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూశారు. చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.

News August 11, 2025

ఈనెల 14న మాజీ సీఎం జగన్ అనంతపురానికి రాక

image

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 14న అనంతపురం రానున్నారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహానికి హాజరు కానున్నారు. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా హెలిప్యాడ్, బారికేడ్లు తదితర ఏర్పాట్లను విశ్వేశ్వర రెడ్డితో కలిసి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిశీలిస్తున్నారు.

News August 11, 2025

ఈనెల 18న కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా

image

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేయనున్నట్లు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు తెలిపారు. రాయదుర్గంలో ఆదివారం స్థానిక కమిటీల ఏర్పాటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని మండిపడ్డారు.

News August 10, 2025

79 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

image

అనంతపురంలోని క్లాక్ టవర్ నుంచి 79 అడుగుల జాతీయ జెండాతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విశ్వవిద్యాలయం తరుపున హర్ ఘర్ తిరంగా ర్యాలీని విజయవంతంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

News August 10, 2025

రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

అనంతపురం కలెక్టరేట్‌లో రేపు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం జరుగుతుందని ఇన్‌ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. అలాగే అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్‌లోనూ అర్జీలు సమర్పించొచ్చని చెప్పారు.

News August 10, 2025

రాగులపాడు పంప్ హౌస్‌లో 10 మోటార్లతో నీటి పంపింగ్

image

వజ్రకరూరు మండలం రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 10 మోటార్ల ద్వారా శనివారం నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలోకి పంపింగ్ చేశారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి రాగులపాడు పంప్ హౌస్ నుంచి 10 మోటార్లతో నీటి పంపింగ్ చేసేలా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబుకు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు. హంద్రీనీవా కాలువలో పుష్కలంగా నీరు వస్తోందని, ఇందుకు చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.

News August 9, 2025

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ నంబర్లకు ఫోన్ చేయండి: ఎస్పీ

image

ఎక్కడైనా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే డయల్ 100/112 లేదా సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. అనంతపురం జిల్లాలోని వాహనదారులు అధిక శబ్దంతో కూడిన స్పీకర్లు, సైలెన్సర్లు ఉపయోగించి అధిక వేగంగా వెళ్లరాదన్నారు. బైక్‌పై త్రిబుల్ రైడింగ్ చేయరాదని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణీకులను తీసుకెళ్లరాదన్నారు. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడరాదన్నారు.

News August 9, 2025

అనంత జిల్లాలో 746 కేసులు నమోదు

image

అనంతపురం జిల్లాలో 76 ఓపెన్ డ్రింకింగ్, 44 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై 626 ఎంవీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రూ.2,27,046 జరిమానాలు విధించామన్నారు. 42 పోలీసు స్టేషన్ల పరిధిలో అక్కడి పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌ నిర్వహించి, వాహనాల తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.