India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడిపత్రిలో వ్యభిచార స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాలతో రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి పక్కా సమాచారంతో తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిలో ఒకరిది వైజాగ్, మరోకరు ఆర్గనైజర్తోపాటు నలుగురు మగ వ్యక్తులను, 4 నిరోధ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేస్తున్నట్లు CI శివగంగాధర్ తెలిపారు.
అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రుకియ బేగం ఆదివారం నెల్లూరుకు వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ఆమె భర్త రియాజ్ పేర్కొన్నారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని ఆమె కాలికి తీవ్ర గాయాలు అయ్యాయని అన్నారు. తిరుపతి శివారులలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆమె చికిత్స పొందుతుందన్నారు.
ఇంటర్ ఫలితాల్లో పామిడికి చెందిన రామచంద్ర నాయక్, రమాదేవి దంపతుల కుమార్తె గీతాంజలి సత్తా చాటారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివిన యువతి బైపీసీ విభాగంలో 1000కి 984 మార్కులు సాధించారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ మార్కులు వచ్చాయని గీతాంజలి తెలిపారు. అధ్యాపకులు, స్నేహితులు, బంధు మిత్రులు అభినందించారు.
ఇంటర్ ఫలితాల్లో పామిడికి చెందిన రామచంద్ర నాయక్, రమాదేవి దంపతుల కుమార్తె గీతాంజలి సత్తా చాటారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివిన యువతి బైపీసీ విభాగంలో 1000కి 984 మార్కులు సాధించారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ మార్కులు వచ్చాయని గీతాంజలి తెలిపారు. అధ్యాపకులు, స్నేహితులు, బంధు మిత్రులు అభినందించారు.
అనంతపురంలోని తేజ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని డైరెక్టర్ తేజరెడ్డి, ఛైర్పర్సన్ ఉమాదేవి తెలిపారు. సీనియర్ ఇంటర్లో అత్యధికంగా 991 మార్కులు, జూనియర్ ఇంటర్లో ఎంపీసీ 465, బైపీసీ 435 మార్కులతోపాటు మరెంతో మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడం ఆనందంగా ఉందన్నారు. ఫలితాలపై కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.
పరిగి మండలం ధనాపురం గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. రొద్దం మండలంలోని దొడగట్ట గ్రామానికి చెందిన వారు ఆటోలో హిందూపురం కోటిపి చౌడమ్మ దేవస్థానానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని అనంతపురం జిల్లా యాడికి పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. స్థానికుల వివరాల మేరకు.. యాడికికి చెందిన గంజి శేఖర్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు భార్య సౌమ్యకు వీడియో పంపాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వీరన్న టెక్నాలజీని ఉపయోగించి ఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్య చేసుకోబోయిన గంజి శేఖర్ను కాపాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అనంతపురం జిల్లా నేతలకు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటు దక్కింది. 33 మందితో మాజీ సీఎం వైఎస్ జగన్ కమిటీని నియమించగా తలారి రంగయ్య, శంకర్ నారాయణ, శైలనాథ్, విశ్వేశ్వరరెడ్డిలకు చోటు కల్పించారు. మరోవైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.
అనంతపురం జిల్లా వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యను నియమిస్తూ.. వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వైసీపీ అధ్యక్షులు YS జగన్ శనివారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. తలారి రంగయ్యకు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్ ఫలితాల్లో అనంత జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 19,541 మంది పరీక్షలు రాయగా 15,632 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో అనంత జిల్లా రాష్ట్రంలోనే 13వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 22,824 మందికి 14,439 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 17వ స్థానంలో జిల్లా నిలిచింది.
Sorry, no posts matched your criteria.