India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులకు సూచించారు. అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో పరిశ్రమల ఏర్పాటు, ప్రోత్సాహకాలపై సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తే వారు పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు.

అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులకు సూచించారు. అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో పరిశ్రమల ఏర్పాటు, ప్రోత్సాహకాలపై సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తే వారు పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు, జరిమానాల కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసమే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 200 మంది డ్రైవర్లకు ECG, 2డీ ఎకో, కంటి, దంత పరీక్షలను GGH వైద్యుల చేత నిర్వహించామన్నారు. రోడ్డు భద్రత ఒక బాధ్యత కాదని, అది మనందరి కర్తవ్యమని అన్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు ప్రధాన కారణాలని సూచించారు.

అనంతపురం జిల్లాలో కొత్త బార్ పాలసీలో భాగంగా 7 బార్ల దరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతపురంలో మూడు, గుంతకల్లులో రెండు, తాడిపత్రి, రాయదుర్గంలో ఒక్కో బార్ కోసం జిల్లా ఎక్సైజ్ అధికారి రామమోహన్ రెడ్డి గెజిట్ విడుదల చేశారు. ఫిబ్రవరి 4న దరఖాస్తులు స్వీకరించి, 5న లాటరీ నిర్వహిస్తారు. అప్లికేషన్ కోసం రూ.5లక్షల డీడీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

భారత క్రికెటర్ నితిన్ కుమార్ అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులను అప్యాయంగా దగ్గరకు పిలుచుకుని వారితో సరదాగా ఫొటోలు దిగారు. అనంతరం బ్యాట్పై ఆటోగ్రాఫ్ చేసి ఆలూరు విరాట్ అనే బాలుడికి బహుమతిగా అందజేశారు. స్టార్ క్రికెటర్ తమతో సమయం గడపడమే కాకుండా, సిగ్నేచర్ చేసిన బ్యాట్ ఇవ్వడంతో చిన్నారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన ఇల్లూరు ప్రవీణ్ కుమార్ గ్రూప్-2 ఉద్యోగం సాధించాడు. ప్రవీణ్ కుమార్ ఎక్కడా కోచింగ్కు వెళ్లకుండా సొంతగా గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యారు. కాగా, మొన్న విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో పోస్టు సాధించి ప్రస్తుతం కడపలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్స్-2లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించాడు.

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భార్యాభర్తలు గ్రూప్-2లో ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. పట్టణానికి చెందిన వినీత సబ్ రిజిస్ట్రార్గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో పనిచేస్తున్న సమయంలో నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రిజైన్ చేసి ప్రిపేర్ అయ్యామని Way2newsకు వారు తెలిపారు.

చెళ్లకెర వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ పంటకు రికార్డు స్థాయి ధర లభించింది. శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన రైతులు నాగభూషణ గౌడ, మంజన్న, పెన్నప్ప పండించిన వేరుశనగ క్వింటా ధర రూ.12,810 పలికింది. నాణ్యమైన దిగుబడి సాధించినందుకు మార్కెట్ యార్డ్ యజమానులు రంగస్వామి, ఈరన్న రైతులను సన్మానించారు. ఈ ధర ఇతర రైతుల్లో ఆనందాన్ని నింపింది.

అనంతపురం JNTUలో ఐదుగురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ బుధవారం వైస్ ఛాన్స్లర్ హెచ్.సుదర్శన రావు, రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్న బి.వెంకటేష్, పి.రాధ, ఎన్.చందురాణి సీనియర్ అసిస్టెంట్లుగా, సూపరింటెండెంట్గా ఉన్న ఎస్.మహేశ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా, సీనియర్ అసిస్టెంట్గా ఉన్న ఎస్.నాగప్ప సూపరింటెండెంట్గా పదోన్నతులు పొందారు.

జనవరి 31న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1న సెలవు దినం కావడంతో ఒక్కరోజు ముందుగానే జిల్లాలో పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాలో 2,77,685 పెన్షనర్లకు రూ.123.88 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
Sorry, no posts matched your criteria.