India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురంలో శనివారం నిర్వహించిన SGF జిల్లాస్థాయి క్రీడా పోటీలలో ప్రతిభ కనపరిచిన పెద్దవడుగూరు విద్యార్థులు పలువురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిలో పల్లవి, భువన చంద్రిక, చిన్న ఓబుల రెడ్డి, జ్ఞానేశ్వర్ (వెయిట్ లిఫ్టింగ్) ఉన్నారని ఉపాధ్యాయుడు మారుతి తెలిపారు. రాష్ట్రస్థాయికి తమ పిల్లలు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. అర్జీదారులు Meekosam.ap.gov.in వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేవాలయాలు, ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న ముగ్గురు పాత నేరస్థులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.22 లక్షల విలువైన 12.350 కేజీల వెండి, 44 గ్రాముల బంగారం, ఇత్తడి, రాగి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 20 చోరీ కేసులను ఛేదించినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 9,275 మంది ఆటో డ్రైవర్లకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందనున్నట్లు డీటీసీ వీర్రాజు పేర్కొన్నారు. రాప్తాడు 1752, గుంతకల్లులో 1655, సింగనమల 1643, తాడిపత్రి 1614, అనంతపురం అర్బన్ 1137, ఉరవకొండ 808, రాయదుర్గం 343, కళ్యాణదుర్గం 323 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా కార్యక్రమం చేపట్టనున్నారు.

యాడికి మండలానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైనట్లు శుక్రవారం రాత్రి సీఐ వీరన్న తెలిపారు. విద్యార్థిని యాడికిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఉదయం బస్సులో స్కూల్కి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. బాలిక తండ్రి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అమృత్ పనులు వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ వద్ద అమృత్ పథకం పనులు, టిడ్కో ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై పబ్లిక్ హెల్త్, నగర పాలక సంస్థ, టిడ్కో అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. మొదటి దశ పనులు నెల రోజుల్లో ట్రయల్ రన్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లాలో 301 చెరువులకు నీరు అందించేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హెచ్ఎల్సీ, మైనర్ ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. హెచ్ఎస్ఎస్ఎస్, హెచ్ఎల్సీ కింద ఉన్న చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరితగతిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

ఉరవకొండలోని పాల్తూరు రోడ్డు సమీపంలోని పొలాల్లో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అత్యవసర వాహనాలకు సమాచారం అందించారు. వాహనాలు అందుబాటులోకి రాకపోవడంతో స్థానిక చారిటబుల్ ట్రస్ట్ అధినేతే కేశన్న తన సొంత వాహనంలో క్షతగాత్రుడిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ORR రోడ్ శిథిలమవుతున్న పరిస్థితి, ట్రాఫిక్ సమస్యలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాల కారణంగా చాలా కంపెనీలు ఇప్పుడు ఉత్తర బెంగళూరు, వైట్ఫీల్డ్ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నాయని క్రిస్టియన్ మ్యాథ్యూ ఫిలిప్ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి లోకేశ్ ‘ఉత్తరం బాగుంది. కొంచెం ఉత్తరం వైపు అనంతపురం ఉంది. అక్కడ మనం ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ మరియు రక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నాం’ అని బదులిచ్చారు.

అనంతపురానికి చెందిన నిజాంను ఇండియాకు రప్పించేందుకు తన టీం ఫాలో అప్ చేస్తుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘నిజాం దుస్థితి నన్ను తీవ్రంగా కలచివేసింది. అతన్ని సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి, అతని కొడుకుకు వైద్య సహాయం అందించడానికి నేను అన్ని విధాలుగా సహాయం చేస్తానని హామీ ఇస్తున్నా’ అని పేర్కొన్నారు. నిజాం సౌదీకి వెళ్లి ఇబ్బందులు పడుతూ తనను కాపాడాలని వేడుకున్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.