India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఐదో రోడ్లో నివాసం ఉండే అనిత అనే వివాహిత సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీకి వేదికైన అనంతపురంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ (ACA) ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీఏ కార్యకర్గ సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కడపలోని అకాడమీని అనంతపురానికి తరలిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై సభ్యులు చర్చించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక్కడ అకాడమీ ఏర్పాటైతే ప్రతిభ ఉన్న క్రికెటర్లకు నాణ్యమైన ట్రైనింగ్ ఫ్రీగా లభిస్తుంది.
అనంతపురంలో ఉంటున్న భారత క్రికెటర్లు ఆంధ్రా ఇడ్లీ రుచి చూస్తున్నారు. టమాటా బాత్, సాంబార్ ఇడ్లీని ఇష్టంగా తింటున్నారట. కోడిగుడ్డు, బ్రెడ్ ఆమ్లేట్, మొలకెత్తిన పెసలు, శనగలు వంటివి అల్పాహారంలో తీసుకుంటున్నారు. మధ్యాహ్నం, రాత్రి మూడు రకాల చికెన్ వంటకాలను మెనూలో ఉంచగా క్రికెటర్లను మటన్ బిర్యానీకి దూరంగా ఉంచారు. ప్లేయర్లు ఉదయం 8లోపే టిఫెన్ చేసి గ్రౌండ్కు వెళ్తున్నట్లు బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు.
అనంతపురం జిల్లాలో టమాటా కిలో రూ.33 పలుకుతున్నట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రాంప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని కక్కలపల్లి టమాటా మార్కెట్లో గరిష్ఠంగా రూ.33తో క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్నారు. దాదాపు 2,250 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయని తెలిపారు. ఇక కిలో సరాసరి ధర రూ.25, కనిష్ఠ ధర రూ.17గా ఉందని వివరించారు.
ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురానికి చెందిన విజయ్ కుమార్ మేనమామ కుమార్తెను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని యువతి ఇంట్లో సంప్రదించగా కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ్ పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ సర్వజన ఆసుపత్రిలో మృతి చెందాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్పీ జగదీశ్ ఆదివారం తెలిపారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. సెప్టెంబర్ 23న తిరిగి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తామన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎనిమిది మంది DSPలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం రూరల్కు DSPగా వెంకటేశ్వర్లు, అనంతపురం-శ్రీనివాసరావు, గుంతకల్-అముదల శ్రీనివాస్, తాడిపత్రి-రామకృష్ణుడు, అనంతపురం ఉమెన్ పీఎస్-మహబూబ్ బాషా, అనంతపురం-శరత్ రాజ్ కుమార్, అనంతపురం-సునీల్, కదిరికి శివనారాయణ స్వామి బదిలీపై రానున్నారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ రెండో తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ దివస్ను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ‘స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని’ నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
అనంతపురం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా జరుగుతోంది. కాగా ఇండియా A & D టీమ్లు D టీమ్ బ్యాట్స్ మెన్ రికీ భుయ్ సెంచరీ చేశారు. 195 బాల్స్కు 113 రన్స్ చేసి ఔటయ్యారు. అభిమానులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఆదివారం కావడంతో క్రికెట్ అభిమానులు ఆర్డీటీ స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఓడీసీ మండలం పరిధిలోని జరికుంటపల్లి గ్రామం వద్ద డాబా యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. బంధువులు వివరాలు మేరకు శనివారం రాత్రి సుమారు 8:30గంటల సమయంలో డాబా యజమాని రమేష్ నిద్ర వస్తోందని భార్య కుమార్తెతో చెప్పి హోటల్ మేడపై ఉన్న గదిలోకి వెళ్లాడు. చాలా సేపు తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి చూడగాఫ్యాన్కు ఉరేసుకోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.