India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలోని కలెక్టరేట్లో ఈ నెల 19న ఉదయం11 గంటలకు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో హంద్రీనీవా, మైనర్ ఇరిగేషన్తో పాటు హెచ్చెల్సీకి కేటాయించిన నీటి విడుదల తేదీలను ప్రకటిస్తామన్నారు. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
అనంతపురం జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలను, సలహాలను అధికారులకు తెలియజేశారు. జిల్లాలో ఉన్న ప్రతి స్కానింగ్ సెంటర్ ఆక్ట్ ప్రకారం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా వినాయక శోభాయాత్ర నిమజ్జనం కార్యక్రమాలు విజయవంతం చేయడంపట్ల ఎస్పీ పోలీస్ సిబ్బందిపై శనివారం ప్రశంసల వర్షం కురిపించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చక్కగా విధులు నిర్వర్తించారన్నారు. కదిరి ధర్మవరం హిందూపురంలోని ప్రధాన పట్టణాల్లో సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి నిబద్ధతతో పని చేశారన్నారు. కావున జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
హిందూపురం మండలం బీరేపల్లి సమీపంలోని కేమల్ పరిశ్రమ గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ మాజీ జవాన్ అచ్చప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. హిందూపురం నుంచి గోరంట్ల వైపు వెళుతున్న కారు వెళ్తుండగా గోరంట్ల నుంచి ద్విచక్ర వాహనంలో అచ్చప్ప హిందూపురం వస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొనడంతో అచ్చప్ప అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హిందూపురం పట్టణంలో ఎక్సైజ్ స్టేషన్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటానికి శనివారం ఎక్సైజ్ పోలీసులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు కమలాకర్, రాంప్రసాద్లు మాట్లాడుతూ.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎక్సైజ్ శాఖను విలీనం చేస్తూ ఎక్సైజ్ శాఖను పునరుద్ధరణ చేయడం ఎంతో అభినందనీయమన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తాగునీటి కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతం చేశారు. 63 పంప్ హౌస్లలో నుంచి నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కార్మికులు ఇవాళ ప్రకటించారు. సత్య సాయి తాగునీటి పథకాన్ని 19 విభాగాలుగా విభజించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని, దీనిని వ్యతిరేకిస్తున్నామని కార్మికులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందన్నారు.
బుక్కపట్నం మండలంలోని గరుగు తాండ గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్ర నాయక్ శుక్రవారం విజయవాడలో గుండెపోటుతో మృతి చెందాడు. శనివారం జిల్లా ఎస్పీ వి.రత్న ఆదేశాలతో ప్రభుత్వా లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు ఎస్కార్ట్ వాహన డ్యూటీ నిమిత్తం విజయవాడకు వెళ్లిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రనాయక్ గుండెపోటుతో మృతి చెందారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మం. గరుగుతండాకు చెందిన చంద్రనాయక్ అనంతపురం జిల్లా సాయుధ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా విమానాశ్రయానికి వెళ్లేందుకు ఎస్కార్ట్ వాహనం సిద్ధం చేశారు. ఈ క్రమంలో చంద్రనాయక్ ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు.
★ అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్లో శుక్రవారం కిలో టమాటా రూ.30 పలికింది. కనిష్ఠ ధర రూ.16, సరాసరి ధర రూ.24 ప్రకారం మార్కెట్లో అమ్మకాలు జరిగాయి.
★ అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం చీనీ కాయలు టన్ను గరిష్ఠ ధర రూ.18 వేలు, కనిష్ఠ ధర రూ.10వేలు, సరాసరి రూ.15 వేలు పలుకాయి.
ముంబై-చెన్నై మధ్య ప్రధాన జంక్షన్గా గుంతకల్లుకు పేరుంది. దక్షిణ మధ్య రైల్వేలోని 5 ప్రధాన డివిజన్లలో గుంతకల్ డివిజన్ 3వది. బ్రిటిష్ ఈస్టిండియా, బ్రిటిష్ ఇండియా పరిపాలన కాలంలోనూ రైలు ప్రయాణాల్లో గుంతకల్ ప్రాభవం పొందింది. అయితే పాత గుంతకల్లులో వెలసిన గుంతకల్లప్ప స్వామి పేరు మీద గుంతకల్లుకు ఆ పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఈ నియోజకవర్గంలో కసాపురం, హజారత్ వలి మస్తాన్ దర్గా ప్రముఖ దర్శనీయ ప్రదేశాలు.
Sorry, no posts matched your criteria.