Chittoor

News December 30, 2025

చిత్తూరు: క్రికెట్ టోర్నీలో అదరగొట్టిన యువకుడు

image

గుంటూరులో జరుగుతున్న ఎలైట్ అండర్-19 క్రికెట్ టోర్నీలో చిత్తూరు జిల్లా వి.కోట విద్యార్థి కార్తీక్ అదరగొట్టాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడుతున్న అతను సెమి ఫైనల్లో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ క్రికెట్ అకాడమీ జట్టుపై చెలరేగి ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన కార్తీక్ 7 ఫోన్లు 3 సిక్సర్లతో 82 బంతుల్లోనే 96 రన్స్ చేశాడు. తన జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. బుధవారం తుది పోరు జరగనుంది.

News December 30, 2025

చిత్తూరు జిల్లాలో 31న రాత్రి తనిఖీలు

image

నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. తప్పతాగి రోడ్లపైకి రావడం, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ న్యూసెన్స్ చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. 31వ తేదీ రాత్రి 9గంటల నుంచి తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు గస్తీ ఉంటుందన్నారు.

News December 30, 2025

చిత్తూరు: కొత్త అధికారుల నియామకం

image

చిత్తూరు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు కొత్త అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ రిటైరయ్యారు. నెల్లూరు జిల్లా ఆత్మ పీడీ మురళికి చిత్తూరు జిల్లా వ్యవసాయ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యాన శాఖ DDగా ఉన్న మధుసూదన్ రెడ్డి సైతం రిటైర్డ్ కాగా ఆయన స్థానంలో ఆత్మ PDగా పనిచేస్తున్న రామాంజనేయులకు DDగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

News December 30, 2025

చిత్తూరులో భారీ స్కాం.. ఆ లైసెన్సులు రద్దు!

image

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన చిత్తూరు జిల్లా GST స్కాంలో జిల్లాకు చెందిన ఏడు పరిశ్రమల లైసెన్సులు రద్దయినట్లు తెలుస్తోంది. వీటిలో హరి ఓం ట్రేడర్స్, హేమ స్టీల్స్, సంతోష్ కాంట్రాక్ట్ వర్క్స్, సాయి కృష్ణ కాంట్రాక్ట్ వర్క్స్, పెద్ద మస్తాన్ ఎంటర్ప్రైజెస్ ఉన్నట్లు సమాచారం. GST స్కాంపై అధికారులు గుట్టుచప్పుడు కాకుండా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఈ జాబితాలోకి మరికొన్ని సంస్థలు చేరనున్నాయి.

News December 30, 2025

కొత్తగా చిత్తూరు జిల్లా ఇలా..!

image

☞ డివిజన్లు: 4 (చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగరి)
☞ మండలాలు: 28
☞ జనాభా: 16,43,224
☞ నియోజకవర్గాలు: 6
☞ పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యాన్ని చిత్తూరులోకి మార్చారు. పుంగనూరు, చౌడేపల్లె మదనపల్లె డివిజన్‌లోకి, సోమల, సదుం మండలాలు పీలేరు డివిజన్‌లోకి వెళ్లిపోయాయి. పులిచెర్ల, రొంపిచర్ల చిత్తూరు డివిజన్‌లోనే కొనసాగనున్నాయి. 4మండలాలు అన్నమయ్యలోకి వెళ్లడంతో జిల్లా జనాభా 2,29,727 లక్షలు తగ్గింది.

News December 29, 2025

చిత్తూరు SPని కలిసిన ట్రైనీ SP

image

చిత్తూరు SP తుషార్ డూడీని సోమవారం ట్రైనీ ఎస్పీ డా.తరుణ్ పహ్వ మర్యాదపూర్వకంగా కలిశారు. 2024 బ్యాచ్‌కు చెందిన ఆయన AP క్యాడర్‌కు ఎంపికయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత 6 నెలల ప్రొబేషనరీ ట్రైనింగ్ నిమిత్తం చిత్తూరుకు చేరుకున్నారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం, సమస్యలను శ్రద్ధగా వినడం, వేగంగా పరిష్కరించడం ముఖ్యమని SP ఆయనకు సూచించారు.

News December 29, 2025

తిరుమల: 365 రోజులు.. 450 ఉత్సవాలు

image

ఏడాదికి 365 రోజులే. కానీ కోరిన కోర్కెలు తీర్చే తిరుమల కోనేటి రాయుడికి ఏడాదిలో 450పైగా ఉత్సవాలు జరుగుతాయి. సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం నక్షత్రోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పద్మావతి పరిణయం తదితర ఉత్సవాలు చేస్తారు. ఇలా రోజూ ఒక పండగగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా తిరుమల విరాజిల్లుతోంది.

News December 29, 2025

26 మండలాలకు తగ్గనున్న చిత్తూరు జిల్లా

image

కొత్త చిత్తూరు జిల్లా 32 నుంచి 26 మండలాలకు పరిమితం కానుంది. <<18703423>>పుంగనూరు<<>> నియోజకవర్గం(6 మండలాలు)ను అన్నమయ్య జిల్లాలో కలుపుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య సైతం 7 నుంచి 6కు చేరుకుంది.

News December 29, 2025

OFFICIAL: చిత్తూరు నుంచి పుంగనూరు ఔట్

image

చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, పుంగనూరుతో అన్నమయ్య జిల్లాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె ఉంటుంది. మరోవైపు బంగారుపాళ్యాన్ని పలమనేరు డివిజన్‌ నుంచి చిత్తూరులో కలిపారు. తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు విలీనానికి గ్రీన్ సిగ్నల్ చ్చారు. జనవరి 1 నుంచి మార్పులు అమలులోకి రానున్నాయి.

News December 29, 2025

చిత్తూరు: ఒకే రోజు రూ.1.25 కోట్ల వసూలు

image

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు పనిచేశాయి. దీంతో రెండు జిల్లాల నుంచి 11,200 మంది వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించారు. తద్వారా సంస్థకు రూ.1.25 కోట్ల ఆదాయం వచ్చిందని ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్ రావు తెలిపారు. సకాలంలో బిల్లులు చెల్లించి జరిమానాలకు దూరంగా ఉండాలని వినియోగదారులకు సూచించారు.