India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం చంద్రబాబు ఈనెల 19న శ్రీసిటీకి రానున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులు సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ ఎన్.యువరాజ్, జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, శ్రీసిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (RARS)లో 12వ తేదీన వివిధ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. JRF, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు తెలియజేశారు. డిప్లమా ఇన్ అగ్రికల్చర్, ఎమ్మెస్సీ అగ్రికల్చర్ నెట్ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://angrau.ac.in/ANGRU/Recruitment_Notification_2021.aspx వెబ్సైట్ చూడాలని సూచించారు.
టీటీడీ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. సుమారు 50 మంది ఇంజనీరింగ్, ఇతర శాఖల ఉద్యోగులకు స్టేట్ విజిలెన్స్ విభాగం షోకాజ్ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. ఇది ఉద్యోగస్తులను బెదిరించడమేనని వెల్లడించారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, కూటమి నాయకులు వేధింపులు మానుకోకపోతే పార్లమెంటుకు దృష్టికి తీసుకువెళ్తానన్నారు.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఇటీవల పుంగనూరులో జరిగిన టీడీపీ శ్రేణుల దాడిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర హోం శాఖ ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోం శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఎంపీ మిథున్ రెడ్డికి ప్రత్యర్థుల నుంచి హాని ఉందనే కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నిరంతరం ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఉండబోతుంది.
తిరుమలలోని ఓ మఠంలో రెండో వివాహానికి హైదరాబాద్ వాసి రాకేశ్ సిద్ధమయ్యాడు. సమాచారం తెలుసుకుని మొదటి భార్య సంధ్య అక్కడికి వచ్చింది. మొదటి భార్యను చూసి కళ్యాణ మండపం నుంచి రాకేశ్ అక్కడ నుంచి పరారయ్యాడు. సంధ్య తిరుమల పీఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంధ్య మాట్లాడుతూ.. ‘మాకు ఏడేళ్ల పాప ఉందని, మా మధ్య వివాదానికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తోంది’ అని అన్నారు.
పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడపై గురువారం చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాదిగబండ సమీపంలోని తన క్వారీలో ఈనెల 6వ తేదీ రాత్రి మూడు టిప్పర్లు, రెండు హిటాచీలు, ఒక ఎక్స్కవేటర్ను మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తీసుకెళ్లిపోయారంటూ జనార్దన నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వెంకటేగౌడపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లింట విషాదం చోటుచేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. శాంతిపురం(M), సంతూరు గ్రామానికి చెందిన నవీన్కి కర్ణాటక రాష్ట్రం బైనహళ్లికి చెందిన నిఖితశ్రీతో వరుడి సోదరి గ్రామం చందరసనహళ్లిలో వివాహమైంది. ఆ తర్వాత నవదంపతులు ఓ గదిలోకి వెళ్లారు. గంట వ్యవధిలోనే వారి మధ్య ఏం జరిగిందో కానీ కొడవలి దాడిలో వధువు నిఖితశ్రీ మృతి చెందగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరుడు నవీన్(30) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్ధం గోవా రాష్ట్ర మంత్రి విశ్వజిత్ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహాల వద్ద ఆయనకు రిసెప్షన్ అధికారులు పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి ఆయన తిరుమలలోనే బసచేసి శుక్రవారం వేకువజామున శ్రీవారిని అభిషేకం సేవలో దర్శించుకోనున్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్ధం గోవా రాష్ట్ర మంత్రి విశ్వజిత్ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహాల వద్ద ఆయనకు రిసెప్షన్ అధికారులు పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి ఆయన తిరుమలలోనే బసచేసి శుక్రవారం వేకువజామున శ్రీవారిని అభిషేకం సేవలో దర్శించుకోనున్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కేంద్ర హోం శాఖ CRPF భద్రత కల్పించినట్టు సమాచారం. ఇటీవల పుంగనూరులో అల్లర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల నుంచి హాని ఉందని.. భద్రత పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.