Chittoor

News May 2, 2024

చిత్తూరు జైలుకు నాయకుల తరలింపు

image

పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో జరిగిన అల్లర్ల కేసులో 9 మంది బీసీవై నాయకులను రిమాండ్‌కు తరలించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. గత సోమవారం ఎర్రాతివారిపల్లెలో అనుమతి లేకుండానే బీసీవై నాయకులు ప్రచారానికి వెళ్లడంతో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది బీసీవై నాయకులు, అలాగే 9 మంది వైసీపీ నాయకులకు రిమాండ్‌ విధించగా.. వారిని చిత్తూరు జైలుకు తరలించారు.

News May 2, 2024

చిత్తూరు: మూడో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు

image

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మూడో తరగతి(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎస్.మూర్తి తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు 20వ తేదీలోగా సంబంధిత గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌కు దరఖాస్తు చేసుకోవాలని.. వివరాలకు 9490957021లో సంప్రదించాలని కోరారు.

News May 2, 2024

వైసీసీ నుంచి వడమాలపేట ZPTC సస్పెండ్

image

నగరి నియోజకవర్గం వడమాలపేట ZPTC మురళి రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినట్లు ఫిర్యాదు అదడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అతనిపై అభియోగాలు వాస్తవమని క్రమశిక్షణ కమిటీ ధ్రువీకరించడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే అతని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.

News May 2, 2024

జడ్జి ఇంటిపై దాడికి పాల్పడ్డ ఘటనలో కేసు

image

బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ ఇంటిపై అర్థరాత్రి దాడికి పాల్పడ్డ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సూర్యనారాయణ కథనం మేరకు.. బి.కొత్తకోటలో కాపురం ఉంటున్న జడ్జి రామకృష్ణ ఇంటిపై మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారం వచ్చి ఇంటి తలుపులు, కిటికీలు, కారు అద్దాలు ద్వంసం చేశాన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అనంతరం జడ్జి ఇంటిపై దాడిచేసింది తమ్ముడు రామచంద్ర అన్నారు

News May 1, 2024

తిరుపతి: రేపు పిఓ, ఏపిఓలకు ట్రైనింగ్

image

ఎన్నికల విధులు కేటాయించబడిన పిఓ, ఎపీఓలకు రెండవ విడత శిక్షణ కొరకు రిటర్నింగ్ అధికారులు పక్కాగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.  స్థానిక కలెక్టరేట్ నుండి ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పీ.ఓ, ఎపీఓలకు పక్కాగా శిక్షణ నిర్వహణ ఉండాలని సూచించారు.

News May 1, 2024

చౌడేపల్లి: ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

image

ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు కథనం ప్రకారం.. తిరుపతికి చెందిన రమేశ్(40) గంగజాతర సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చాడు. అనంతరం బోయకొండ రోడ్డులో ఉన్న సిద్ధప్ప బావి వద్ద ఈతకు వెళ్లినట్లు మృతి చెందాడు. సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని గుర్తించి వెలికితీశామని అన్నారు.

News May 1, 2024

చిత్తూరు: బ్యాంకుల వద్ద వృద్ధుల అవస్థలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల సేవలు నిలిచాయి. ఈక్రమంలో నడవలేని వారికి ఇంటి వద్దే పింఛన్ డబ్బులు అందజేశారు. ఆధార్ కార్డు లింకు అయిన బ్యాంకు ఖాతాల్లో మరికొందరికి నగదు జమ చేశారు. ఆ డబ్బులు తీసుకోవడానికి వృద్ధులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

News May 1, 2024

తిరుపతి: మే 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

image

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మే 3వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 నుంచి10 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వంలోని మీటింగ్ హాల్‌లో జరుగనుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డికి ఫోన్‌ ద్వారా నేరుగా తెలపవచ్చు అన్నారు.

News May 1, 2024

మదనపల్లెలో రియల్టర్‌పై కొడవలి, కత్తులతో దాడి

image

మదనపల్లెలో రియల్టర్ శ్రీనివాసులు రెడ్డిపై ప్రత్యర్థులు కొడవలి, కత్తులతో పట్టపగలే హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి  కుటుంబీకులు కథనం.. స్థానిక సీపీఎం రోడ్డు, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంటున్న రమణారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డిలు శ్రీనివాసులు రెడ్డిపై కత్తులు కొడవళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. హత్యాయత్యానికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

News May 1, 2024

రామచంద్ర యాదవ్‌పై హత్యాయత్నం కేసు

image

చిత్తూరు జిల్లా సదుం మండలంలో జరిగిన అల్లర్ల కేసులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌తో పాటు 13 మందిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మారుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కట్టారు. అలాగే గ్రామంలోకి అనుమతి లేకుండా వెళ్ల వద్దని పోలీసులు సూచించినా.. లెక్కచేయకుండా వెళ్లడంతో రామచంద్ర యాదవ్‌తో పాటు పలువురిపై మరో కేసు నమోదు చేశారు.